Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త.. బ్రేక్ తీసుకున్న గోల్డ్, కొత్త నెలలో..

Gold Price Today: ప్రపంచ వ్యాప్తంగా పరిణామాలు మళ్లీ వేడెక్కుతున్న వేళ పసిడి ధరలు మాత్రం చల్లారుతున్నాయి. వాస్తవానికి గడచిన రెండు వారాలకు పైగా గోల్డ్ రేట్లు నిరంతరం పెరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాలంలో తిరిగి గోల్డ్ రేట్లు నెమ్మదించటంతో పాటు నేడు పెరుగుదలకు చిన్న బ్రేక్ ఇచ్చింది. దీంతో ఆభరణాల కొనుగోలుదారులు సంతోషంలో ఉన్నారు.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే నేడు చిన్న బ్రేక్ తీసుకుని స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7940, ముంబైలో రూ.7940, దిల్లీలో రూ.7955, కలకత్తాలో రూ.7940, బెంగళూరులో రూ.7940, కేరళలో రూ.7940, పూణేలో రూ.7940, వడోదరలో రూ.7945, జైపూరులో రూ.7955, లక్నోలో రూ.7955, కోయంబత్తూరులో రూ.7940, మంగళూరులో రూ.7939, నాశిక్ లో రూ.7942, అయోధ్యలో రూ.7954, బళ్లారిలో రూ.7939, గురుగ్రాములో రూ.7954, నోయిడాలో రూ.7954 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

Good news to gold and silver buyers as rates stayed calm in wedding season

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే ఎలాంటి మార్పులు లేకుండా నేడు కొనసాగుతున్నాయి. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.8662, ముంబైలో రూ.8662, దిల్లీలో రూ.8677, కలకత్తాలో రూ.8662, బెంగళూరులో రూ.8662, కేరళలో రూ.8662, పూణేలో రూ.8662, వడోదరలో రూ.8667, జైపూరులో రూ.8677, లక్నోలో రూ.8677, కోయంబత్తూరులో రూ.8662, మంగళూరులో రూ.8661, నాశిక్ లో రూ.8664, అయోధ్యలో రూ.8676, బళ్లారిలో రూ.8661, గురుగ్రాములో రూ.8676, నోయిడాలో రూ.8676గా ఉన్నాయి.

మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. నిపుణుల అంచనాల ప్రకారం పసిడి ధర ఔన్సుకు 3000 డాలర్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా గోల్డ్ భారీగా ధర పెరుగుతూ భవిష్యత్తు ధరలపై క్లారిటీ వస్తోంది.

తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7940గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8662 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,05,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+