PM Kisan Yojana: దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోదీ సర్కార్ 3.0 పెద్ద శుభవార్త చెప్పింది. ఈ సారి ముందుగా ప్రధాని తన ప్రస్థానాన్ని రైతులకు మేలు చేసే కార్యక్రమం నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత సొమ్ము జమ కోసం నిరీక్షణకు తెరపడనుంది. కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే, రైతుల కోసం తదుపరి విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని మంజూరు చేసే ఫైలుపై సంతకం చేశారు. దీంతో కోట్ల మంది రైతుల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. తాజాగా వారి ఖాతాల్లో డబ్బు జమకు సంబంధించిన తేదీ వివరాలు వెలువడ్డాయి.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జూన్ 18, 2024న మొత్తం దాత ఖాతాలో జమ చేయబడుతుందని సమాచారం. ప్రధాని మోదీ జూన్ 18న వారణాసిలో పర్యటిస్తుండగా.. అక్కడి నుంచి DBT ద్వారా దేశంలోని 9.3 కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు 20,000 కోట్లు బదిలీని పరిశీలిస్తారని తెలుస్తోంది. వాస్తవానికి.. పీఎం కిసాన్ యోజన అనేది పేద రైతుల సంక్షేమం కోసం మోదీ సర్కార్ తీసుకొచ్చిన స్కీమ్. రైతు బంధు పేరుతో తెలంగాణలో గత ప్రభుత్వం అమలు చేసిన పథకాన్ని దేశవ్యాప్తంగా రైతులకోసం మోదీ విస్తరించారు.
పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ మొత్తాన్ని అందుకోవడానికి లబ్దిదారుడు రైతుల ఆధార్ కార్డు తప్పనిసరిగా వారి బ్యాంకు ఖాతాతో అనుసంధానించబడి ఉండాలి. ఈ పథకాన్ని పొందేందుకు eKYC, యాక్టివ్ బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అవసరం. ఈ ప్రభుత్వ పథకంలో భూమి ధృవీకరణ కూడా ఒక ముఖ్యమైన ప్రక్రియ. జాబితాలోని పేరును తనిఖీ చేయడానికి రైతులు ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్సైట్ www.pmkisan.gov.inని సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ హోమ్ పేజీలో 'బెనిఫిషియరీ లిస్ట్' ట్యాబ్పై క్లిక్ చేసి.. రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను పూరించి రిపోర్ట్ ట్యాబ్పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ స్క్రీన్పై లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. అందులో మీరు మీ పేరును తనిఖీ చేసుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications