7th Pay Commission: 2025లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి రోజులు వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వటంతో ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం 8వ వేతన సంఘం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనివల్ల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారని తెలుస్తోంది. జనవరి 2016లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన 7వ వేతన సంఘం సిఫార్సులు డిసెంబర్ 31, 2025న ముగియనున్న తరుణంలో తాజా పరిణామాలు వచ్చాయి. దీనికి ముందు ఏర్పాటు చేసిన వేతన సంఘాల విషయంలోనూ 10 ఏళ్ల కాలవ్యవధిని భారత ప్రభుత్వం అనుకరించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం దేశంలో ఉన్న కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలో వేతనాలు, అలవెన్సులతో పాటు ఇతర ప్రయోజనాల సవరించటం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ 2026 నాటికి కమిషన్ను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1, 2025న జరగనున్న కేంద్ర బడ్జెట్ ప్రజెంటేషన్లో దీనికి సంబంధించిన ముఖ్యమైన పరిణామాలు వెల్లడి కావచ్చని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.57 నుంచి 2.86కు పెంచే అవకాశం ఉందని, ఇది ఉద్యోగుల బేసిక్ వేతనాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని నివేదికలు చెబుతున్నాయి. గతంలోనూ 6వ వేతన సంఘం నుంచి 7వ వేతన సంఘానికి మారినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నిర్మాణంలో గణనీయమైన పురోగతిని కనిపించింది. 7వ వేతన సంఘం కింద 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను అమలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనం 2.57తో గుణించబడటంతో వారి ప్రాథమిక వేతనంలో 2.57 శాతం మేర పెరుగుదలకు కారణమైంది.
ప్రస్తుతం కొనసాగుతున్న 7వ వేతన సంఘం సిఫార్సులు 2016 నుంచి అమలు చేయబడుతున్నాయి. దీనికింద కనీస వేతనం రూ.18 వేల నుంచి గరిష్ఠంగా రూ.2.5 లక్షల వరకు అందించబడుతోంది. అలాగే ఉద్యోగులకు అందించే గ్రాట్యుటీ సీలింగ్ రూ.20 లక్షలుగా ఉంచగా, డీఐ ఆధారంగా కాలానుగుణంగా పెంచే సదుపాయాన్ని అందించింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications