భారత రైల్వే ప్రయాణీకుల కోసం కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఏసీ కోచ్లలో ప్రయాణించే వారికి దుప్పటి కవర్లను అందించే పైలట్ ప్రాజెక్ట్ జైపూర్-అహ్మదాబాద్ రైలులో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం ప్రయాణీకులకు శుభ్రత, సౌకర్యం, మెరుగైన అనుభవాన్ని అందించడంగా చెప్పుకోవచ్చు.
రైల్వే మంత్రి మాట్లాడుతూ.. రైల్వేలలో దుప్పట్ల వాడకం ఎప్పటి నుంచో ఉంది..అయితే శుభ్రత విషయంలో సమస్యలు ఉన్నాయి. దీన్ని పరిష్కరించడానికి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాం. ప్రయోగం విజయవంతమైతే, దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. అలాగే, చిన్న స్టేషన్లలో సౌకర్యాలను పెంచడం, ప్లాట్ఫామ్ ఎత్తు, సైన్బోర్డులు, సమాచార వ్యవస్థలు మెరుగుపరచడం కూడా ప్రణాళికలో భాగంగా ఉందని చెప్పారు.

ప్రతి ప్రయాణీకుకు శుభ్రమైన దుప్పట్లు అందించబడతాయి.కవర్లు నాణ్యమైన, ఉతకగల పదార్థంతో తయారు చేయబడ్డాయి. ప్రతి ప్రయాణం తర్వాత భర్తీ చేయబడతాయి. అంటే వాటిని మళ్లీ ఉతికి అందించడం జరుగుతుంది. వెల్క్రో లేదా జిప్లాక్తో కవర్లను మూసివేసి శుభ్రతను నిర్ధారిస్తారు.ఈ పైలట్ ప్రాజెక్ట్లో సంగనేరి ప్రింట్ ఫాబ్రిక్ ను ఉపయోగించి, మన్నిక, సులభంగా ఉతకడం కోసం కవర్లు రూపొందించబడ్డాయి. ప్రయోగ ఫలితాల ఆధారంగా, భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల సాంప్రదాయ ప్రింట్లను కూడా చేర్చాలని ప్రణాళిక ఉంది.
ఇక ప్రయోజనాల విషయానికి వస్తే. ప్రతి ప్రయాణీకుకు శుభ్రమైన దుప్పటి అందించడం ద్వారా సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది.భరోసాను అందించడం, మొత్తం ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.ఈ పైలట్ విజయవంతమైతే, ఈ విధానం దేశంలోని ఇతర రైళ్లలో కూడా అమలు అవుతుంది. రైల్వే ప్రయాణికులు ఈ కొత్త సౌకర్యంతో ఆనందం, సౌకర్యం, విశ్వసనీయతను పొందగలరు. ఈ ప్రయత్నం రైల్వే ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయడానికి Indian Railways తీసుకుంటున్న చర్యలలో ఒక ముఖ్యమైన అడుగగా అభివర్ణించవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications