Common Man Budget: అధిక ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో కూరగాయల నుంచి పప్పు దినుసుల వరకు అనేక వస్తువుల ధరలు భారీగా పెరిగి సామాన్యుల బడ్జెట్లో అధిక స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. అయితే మోదీ 3.0లో పెద్ద ఊరట లభించనుంది.
ఈ ఏడాది సానుకూల రుతుపవనాల కారణంగా.. దిగుమతులు పెరగవచ్చన్న అంచనాలతో వచ్చే నెల నుంచి దేశంలో పప్పు దినుసుల ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే శుక్రవారం తెలిపారు. దీంతో పాటు పప్పుల ధరలపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఖరే పేర్కొన్నారు. అలాగే వచ్చే నెల నుంచి ఈ మూడు రకాల పప్పుల దిగుమతులు కూడా పెరుగుతాయని, ఇది దేశీయ సరఫరాను పెంచేందుకు దోహదపడుతుందన్నారు.

వినియోగదారుల వ్యవహారాల శాఖ దేశంలోని 550 ప్రధాన వినియోగదారు కేంద్రాల నుంచి ఆహార ఉత్పత్తుల రిటైల్ ధరలను సేకరిస్తోంది. "జులై నుంచి రుతుపవనాల ధరలు గణనీయంగా తగ్గుతాయని అంచనా వేసింది." పప్పుధాన్యాల సాగులో ఉన్న ప్రాంతాల్లో రైతులకు మెరుగైన విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశీయంగా పప్పుధాన్యాల లభ్యతను పెంచేందుకు, రిటైల్ ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఖరే చెప్పారు. 'భారత్ చన దాల్'ను కిలో రూ.60కి విక్రయించాలన్న ప్రభుత్వ పథకం సామాన్యులకు ఊరటనిస్తోందన్నారు.తమ శాఖ గ్లోబల్ సప్లయర్లతో పాటు దేశీయ రిటైలర్లు, హోల్సేలర్లు, పెద్ద రిటైల్ చైన్లతో నిరంతరం టచ్లో ఉందన్నారు.
భారతదేశం గత ఆర్థిక సంవత్సరంలో సుమారు ఎనిమిది లక్షల టన్నుల కందిపప్పు, ఆరు లక్షల టన్నుల మినపప్పు దిగుమతి చేసుకుంది. పప్పులు ప్రధానంగా మయన్మార్, ఆఫ్రికన్ దేశాల దిగుమతయ్యాయి. దేశీయంగా ఉన్న షార్టేజ్ దిగుమతులతో పూడ్చబడుతుంది.
ఇక కూరగాయల విషయంలోనూ రుతుపవనాల వల్ల కురవనున్న వర్షాలు చిల్లర ధరలపై సానుకూల ప్రభావం చూపుతాయని ఖరే చెప్పారు. ఎండవేడిమి ప్రభావంతో పచ్చికూరగాయలు పండడంతో బంగాళదుంపలకు డిమాండ్ పెరిగిందన్నారు. బఫర్ స్టాక్ కోసం ప్రభుత్వం ఉల్లి కొనుగోళ్లను ప్రారంభించింది. ఇప్పటికే 35,000 టన్నుల ఉల్లిని సేకరించారు. కోల్డ్ స్టోరేజీ, రేడియేషన్ ప్రక్రియ ద్వారా ఉల్లిపాయల జీవితకాలాన్ని పొడిగించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications