కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రధానంగా విమానయానం, హాస్పిటాలిటీ, హోటల్ రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. అయితే మున్ముందు భారత ఆర్థిక వ్యవస్థకు మంచి రోజులు (గోల్డెన్ ఇయర్స్) ఉన్నాయని చెబుతున్నారు ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా. దేశంలో మున్ముందు వృద్ధి రేటును చూసి ప్రజలు ఆశ్యర్యపోతారన్నారు. లౌకికత్వం, నిర్మాణాత్మక చర్యల వల్ల స్టాక్ మార్కెట్ వేగం పుంజుకుంటుందని జోస్యం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనా మహమ్మారిని ధీటుగా ఎదుర్కొంటున్నారని, స్టాక్ మార్కెట్లు కుదేలవుతాయని తాను భావించడం లేదన్నారు. ప్రస్తుతం ఈ వైరస్ తగ్గుముఖం పట్టిందని, మరణాలు తగ్గుతున్నాయని, ప్రజలు దీంతో కలిసి జాగ్రత్తగా జీవించడం నేర్చుకుంటున్నారని ఆయన ఈటీ-నౌ ఇంటర్వ్యూలో అన్నారు.

కరోనా కేసులు కాదు..
మున్ముందు భారత్ ప్రపంచ రైతు, కర్మాగారంగా కాగలదని రాకేష్ ఝున్ఝున్వాలా ధీమా వ్యక్తం చేశారు. ఫార్మా స్టాక్స్ పైన పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారని, అలాగే, టాటా గ్రూప్ స్టాక్స్ రీ-ేటింగ్ ఉండవచ్చునన్నారు. వివిధ రంగాల్లో ఊహించిన దాని కంటే వేగంగా కరోనా నుండి కోలుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇన్వెస్టర్లు కరోనా కేసుల పెరుగుదలపై దృష్టి సారించడం లేదన్నారు. అలాగే, కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నాయన్నారు. ప్రస్తుతం మంచి రిటర్న్స్ కోసం చూస్తున్నారన్నారు. త్వరలో భారత ఆర్థిక వ్యవస్థలో మంచి వృద్ధిని చూస్తామని, ఈ వృద్ధిని చూసి అందరూ ఆశ్చర్యపోతారన్నారు.

ఈ స్టాక్స్ అదుర్స్
కరోనా కారణంగా రెస్టారెంట్, హాస్పిటాలిటీ రంగాలపై ఎక్కువ ప్రభావం పడిందని, ఇవి క్రమంగా కోలుకుంటాయని రాకేష్ చెప్పారు. ప్రపంచ ఫార్మా రాజధానిగా ఇండియా వెలుగొందుతుందన్నారు. ఇక నుండి ఫార్మా మరింత ర్యాలీ సాధిస్తుందన్నారు. ఇటీవల కరోనా నేపథ్యంలోను ఎఫ్ఎంసీజీ కంపెనీలు ర్యాలీ సాధించాయన్నారు. భారత ఐటీ కంపెనీల్లోకి నగదు ప్రవాహం వస్తోందని, మంచి వృద్ధి కొనుగోలుదారులను ఆకర్షిస్తోందన్నారు. ఐటీ కంపెనీల్లోకి నగదు ప్రవాహం దాదాపు లాభాలకు సమానం అన్నారు.

వ్యవసాయ సంస్కరణలు రైతులకు ప్రయోజనం
టాటా సన్స్లోని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్లోని వాటాలను టాటాలు కొనుగోలు చేయవచ్చునని చెప్పారు. ఇటీవలి వ్యవసాయ సంస్కరణలు రాబోయే రోజుల్లో వినియోగదారులకు, రైతులకు ప్రయోజనం కలిగిస్తాయన్నారు. ఈ రంగంలో వ్యర్థాలు తగ్గుతాయన్నారు. భారత అతిపెద్ద విలువ ఆధారిత ఎగుమతుల్లో వ్యవసాయం ఉంటుందన్నారు.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications