భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆగస్టు 11, 2025న గడువు ముగిసే రెండు దశల సావరిన్ గోల్డ్ బాండ్ల (SGBలు)కు ముందస్తు రిడెంప్షన్ ధరను ప్రకటించింది. RBI కీలక ప్రకటనతో.. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులపై విశేష లాభాలను అందుకునే అవకాశం కలగనుంది.
రిజర్వ్ బ్యాంక్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం.. 2019-20 సిరీస్ IX (ఫిబ్రవరి 2020లో జారీ), 2020-21 సిరీస్ V (ఆగస్టు 2020లో జారీ) SGB లను గ్రాముకు రూ. 10,070 చొప్పున ముందస్తుగా రిడీమ్ చేసుకోవచ్చని తెలిపింది. SGBలకు సాధారణంగా ఎనిమిదేళ్ల మెచ్యూరిటీ గడువు ఉంటుంది. అయితే ఆర్బీఐ ప్రకటన ప్రకారం.. పెట్టుబడిదారులు ఐదవ సంవత్సరం ముగిసిన తర్వాత ముందస్తుగా రిడెంప్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 2020లో విడుదలైన సిరీస్ IX ట్రాన్చ్లో పెట్టుబడి పెట్టినవారికి 20 శాతం కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటు (CAGR) లభించింది. అలాగేఆగస్టు 2020లో విడుదలైన సిరీస్ V ట్రాన్చ్ పెట్టుబడిదారులకు ఐదేళ్లలో 13.5 శాతం CAGR అందించింది. ఈ లాభాలకు అదనంగా రెండు ట్రాన్చ్లు కూడా సంవత్సరానికి 2.5 శాతం వడ్డీని ఆరు నెలల కాలానికి చెల్లించడం వల్ల పెట్టుబడిదారులు అందుకునే మొత్తం మరింత పెరగనుంది.

ఫిబ్రవరి 2020లో సిరీస్ IX విడుదలైనప్పుడు బంగారం ధర గ్రాముకు రూ. 4,070గా ఉంది. అప్పటి COVID మహమ్మారి భయంతో ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తుల వైపు మళ్లిన కారణంగా బంగారం ధరలు పెరిగాయి. ఆగస్టు 2020లో సిరీస్ V విడుదలయ్యేసరికి గ్రాముకు రూ. 5,334 చేరుకున్నాయి. తర్వాతి ఐదేళ్లలో ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేటు కోతలు, కేంద్ర బ్యాంకుల నిరంతర బంగారం కొనుగోళ్లు బంగారం ధరలను రికార్డు స్థాయికి చేర్చాయి. ప్రస్తుతం గ్రాము ధర రూ. 10,070కి చేరింది.
నిపుణుల అంచనా ప్రకారం.. ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, US డాలర్ రిజర్వ్ స్థితికి ఎదురవుతున్న సవాళ్లు, అలాగే కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, రాబోయే సంవత్సరాల్లో బంగారం ధరలను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
సావరిన్ గోల్డ్ బాండ్లు అంటే.. గ్రాముల బంగారంలో సూచించబడిన ప్రభుత్వ మద్దతు గల సెక్యూరిటీలు. ప్రత్యక్ష బంగారాన్ని నిల్వ చేయాల్సిన అవసరం లేకుండా..ధర పెరుగుదలతో పాటు అర్ధవార్షిక వడ్డీ ద్వారా రాబడి పొందే అవకాశాన్ని ఇవి కల్పిస్తాయి. రిడెంప్షన్ ధర.. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధరల మూడు రోజుల సగటుపై ఆధారపడి నిర్ణయించబడుతుంది.
వ్యక్తిగత పెట్టుబడిదారులు SGBలను మెచ్యూరిటీ వరకు లేదా అకాల రిడెంప్షన్ తేదీ వరకు ఉంచితే.. మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు పొందుతారు. దీంతో SGBలు బంగారంలో పెట్టుబడికి అత్యంత ఆకర్షణీయమైన మార్గంగా మారాయి.క్లుప్తంగా చూస్తే.. ఈసారి ప్రకటించిన ముందస్తు రిడెంప్షన్ ధరలు పెట్టుబడిదారులకు లాభాలను అందించడమే కాకుండా.. SGBలను సురక్షిత, లాభదాయక పెట్టుబడి సాధనంగా మారనున్నాయి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications