భారీగా తగ్గిన బంగారం ధర, ఇప్పుడు ఎంత ఉందంటే
కరోనా వైరస్ కారణంగా గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టింది. బుధవారం ధర భారీగానే తగ్గింది. ధర రూ.516 పడిపోయి రూ.45 వేల కిందకు దిగి వచ్చింది. ఈ రోజు ఢిల్లీలో బంగారం ధర రూ.44,517గా ఉంది. అంతకుముందు సెషన్లో రూ.45,033గా ఉంది. వెండి ధర స్వల్పంగా పెరిగింది. రూ.146 పెరగడంతో కేజీ వెండి రూ.47,234గా ఉంది.
రుణాలు తీసుకునే వారికి SBI గుడ్న్యూస్, వడ్డీ రేటు తగ్గింపు: డిపాజిటర్లకు షాక్
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.39,982 ప్లస్ 3 శాతం జీఎస్టీ. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.43,648 ప్లస్ జీఎస్టీ. 18 క్యారెట్ల గోల్డ్ కోటెడ్ బంగారం ధర రూ.32,736 ప్లస్ జీఎస్టీ.
కరోనా ఆందోళనలు కాస్త తగ్గడంతో పాటు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలపడటంతో అంతర్జాతీయంగా ఈ లోహాల ధరలు తగ్గాయి. ఇది దేశీయ ధరల పైన ప్రభావం చూపించిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1,661 డాలర్లు, ఔన్స్ వెండి ధర రూ.17.03గా ఉంది.