బంగారం, వెండి కొనుగోలుపై పెట్టుబడిదారులకు కీలక సూచన.. ఈ రేటు వద్ద అమ్మితేనే లాభాలు వస్తాయంటున్న నిపుణులు
గత కొన్ని సెషన్లుగా దేశీయ కమోడిటీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీ పెరుగుదల ధోరణిని కనబరుస్తున్నాయని నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్ (ఫారెక్స్ & కమోడిటీస్) హెడ్ అభిలాష్ కోయిక్కర తెలిపారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో Gold ధరలు సుదీర్ఘ కన్సాలిడేషన్ నుండి బయటపడటంతో పాటు.. సాంకేతికంగా డిసెండింగ్ ట్రయాంగిల్ ఫార్మేషన్ నుండి బ్రేక్అవుట్ సాధించాయని.. ఇది రాబోయే రోజుల్లో ధరల పెరుగుదలకు బలమైన సంకేతమని ఆయన విశ్లేషించారు.
ప్రస్తుతం బేస్ ట్రెండ్ అత్యంత దృఢంగా ఉన్నందున.. మార్కెట్లో సంభవించే ఎలాంటి స్వల్పకాలిక తగ్గుదలలనైనా ట్రెండ్ రివర్సల్గా భావించకూడదని, వాటిని కొనుగోలుకు అద్భుత అవకాశాలుగా మార్చుకోవాలని ఆయన సూచించారు. Gold ధర రోజువారీ ప్రాతిపదికన రూ. 1,55,000 మార్కు కంటే పైన నిలదొక్కుకోవడం సపోర్ట్ బౌన్స్ను ధృవీకరిస్తోందని, కొనుగోలుదారులు మార్కెట్పై పూర్తి పట్టు సాధించారని స్పష్టమవుతోంది.

ఈ క్రమంలో బంగారం తక్షణ నిరోధక స్థాయి అయిన రూ. 1,60,000 లక్ష్యాన్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ బుల్లిష్ సెటప్కు రూ. 1,49,000 స్థాయి అత్యంత కీలకమైన వెన్నెముక వంటి మద్దతుగా పనిచేస్తోంది.
MCX బంగారు ట్రేడింగ్ వ్యూహం
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 154,500 (కొనుగోలు)
లక్ష్యం: రూ. 160,000 (లాభం చూడటం)
స్టాప్ లాస్: రూ. 149,000 (నష్టాన్ని పరిమితం చేయడం)
మరోవైపు వెండి కూడా పతనం నుండి తన బుల్లిష్ ప్రయాణాన్ని పునఃప్రారంభించింది. వెండి ప్రస్తుతం రూ. 2,40,000 వద్ద తక్షణ నిరోధాన్ని (Resistance) ఎదుర్కొంటుండగా, ఈ స్థాయిని దాటితే రూ. 2,51,000 లక్ష్యం వైపు శరవేగంగా దూసుకెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
30 వారాల EMA కలిగిన రూ. 2,30,000 స్థాయి వెండికి బలమైన సపోర్ట్గా నిలుస్తోంది. ధరలు ఈ మద్దతు స్థాయికి పైన ఉన్నంత వరకు స్వల్పకాలిక సాంకేతిక దృక్పథం పూర్తి సానుకూలంగానే ఉంటుందని, సాంకేతిక విశ్లేషణలు, మొమెంటం రెండూ పసిడి, వెండి ధరల పరుగుకు పూర్తి మద్దతు ఇస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
MCX వెండి ట్రేడింగ్ వ్యూహం
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 237,600 (కొనుగోలు )
లక్ష్యం: రూ. 251,000 (లాభం చూడటం)
స్టాప్ లాస్: రూ. 230,000 (నష్టాన్ని పరిమితం చేయడం)
ఇదిలా ఉంటే పసిడి పతనం ముగిసిందని.. త్వరలోనే ఇది 5వేల డాలర్ల మార్కును దాటుతుందని అమెరికా ప్రసిద్ధ ఆర్థికవేత్త, షిఫ్గోల్డ్ ఛైర్మన్ పీటర్ షిఫ్ ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధ భయాల వల్ల బంగారం ధరలలో వచ్చిన తాత్కాలిక దిద్దుబాటు ముగిసిందని.. ఇటీవల నమోదైన పతనాన్ని పసిడి బుల్ రన్ ముగింపుగా భావించకూడదని ఆయన స్పష్టం చేశారు. పసిడి ధరలలో సంభవించిన ఈ తాత్కాలిక తగ్గుదల దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు కొనుగోలు చేయడానికి లభించిన ఒక అద్భుతమైన అవకాశమని ఆయన విశ్లేషించారు.
కాగా పశ్చిమాసియాలో అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మళ్లీ పెంచవచ్చన్న వార్తల నేపథ్యంలో జూలైలో బంగారం ధరలు తీవ్రంగా పడిపోయినట్లు బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
