బంగారం ధర ఈ రేటుకు రాగానే వెంటనే కొనేయండి.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన
భారతదేశంలో బంగారం ధరలు భగ్గముంటున్నాయి. ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. తాజాగా బంగారం ధరలపై షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాచ్స్ డిసెంబర్ 2026 నాటికి బంగారం ధర అంచనాను ఔన్సుకు 4,900 డాలర్లకు పెంచింది. ఇది మునుపటి అంచనా 4,300 డాలర్ల కంటే గణనీయంగా ఎక్కువ. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ అప్గ్రేడ్ వద్ద, Gold నష్టాలు ఇప్పటికీ నికర స్థాయిలో పైకి పెరుగుతున్నట్లు గోల్డ్మన్ పేర్కొన్నది.
బ్యాంక్ విశ్లేషకుల అభిప్రాయంలో.. పాశ్చాత్య బంగారం-ఆధారిత ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) లో బలమైన ఇన్ఫ్లోలు, అలాగే సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు Gold ధర పెరుగుదలకు ప్రధాన ప్రేరణగా నిలుస్తున్నాయని తెలిపింది. ప్రైవేట్ రంగ పెట్టుబడులు చిన్న బంగారు మార్కెట్లోకి ప్రవేశించడం, ETF హోల్డింగ్లను మరింతగా పెంచే అవకాశం ఉందని గోల్డ్మన్ గుర్తించింది.

మంగళవారం ప్రారంభ ట్రేడింగ్లో స్పాట్ Gold ధర దాదాపు ఔన్సుకు రూ. 3,960 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇంట్రాడే గరిష్టంగా 3,977.19 డాలర్లను తాకింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు బంగారం 51 శాతం ర్యాలీ చేసింది. దీని వెనుక కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు, ETFల పెరిగిన డిమాండ్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనమైన US డాలర్ వంటి అనేక అంశాలు సహాయపడ్డాయి.
గోల్డ్మన్ అంచనాల ప్రకారం.. 2025లో సగటు వార్షిక కేంద్ర బ్యాంక్ కొనుగోళ్లు 80 మెట్రిక్ టన్నులు. 2026లో 70 టన్నులు ఉండేలా ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను వైవిధ్యపరచడంలో కీలక పాత్ర పోషిస్తారని బ్యాంక్ విశ్లేషకులు పేర్కొన్నారు. అదనంగా US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు 100 బేసిస్ పాయింట్లు తగ్గించబడే అవకాశం.. బంగారం వంటి దిగుబడి లేని ఆస్తుల ఆకర్షణను మరింత పెంచుతుందని గోల్డ్మన్ తెలిపింది.
మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ VP రాహుల్ కలాంత్రి విశ్లేషణ ప్రకారం, బంగారం, వెండి తాజాగా ఆల్ టైమ్ గరిష్టాలను తాకినట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ట్రాయ్ ఔన్సుకు 4,000 డాలర్లకి దగ్గరగా కదులుతున్నాయని చెప్పారు. ఈ ర్యాలీకి బలమైన ETF పెట్టుబడి డిమాండ్ ప్రధాన కారణంగా కనిపిస్తోందన్నారు. 2025లో ఇప్పటివరకు ETF హోల్డింగ్లు 17 శాతం పెరిగాయి.రాజకీయ ఉద్రిక్తతలు, ఫ్రాన్స్, జపాన్లో పరిస్థితులు, అమెరికాలో ఆర్థిక ఆందోళనలు కూడా సురక్షిత ఆస్తులుగా బంగారం కొనుగోలుకు మద్దతు ఇచ్చాయని కలాంత్రి తెలిపారు.
భారత మార్కెట్ కోసం, ఆయన బంగారం మద్దతును రూ. 1,19,600 నుంచి 1,19,280 శ్రేణిలో అంచనా వేశారు. ఈ స్థాయిలో కొనుగోలు చేయడం వల్ల నష్టాలను నివారించే అవకాశం ఉందని తెలిపారు. ఇక నిరోధాన్ని రూ. 1,20,850 నుంచి రూ. 1,21,400 వద్ద అంచనా వేశారు.అంటే ఈ స్థాయి వద్ద బంగారం కొంటే నష్టాలు వస్తాయని చెబుతున్నారు.
గోల్డ్మన్ సాచ్స్ ప్రకారం.. సెప్టెంబర్లో గణనీయమైన పెరుగుదల తర్వాత కూడా, బంగారం ధర ఊహాజనిత స్థితిలో కాకుండా స్థిరంగా ఉంది. దీని ఫలితంగా 2026 వరకు బంగారం ధర మరింత పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications