Gold Rate: మంగళవారం బ్రేక్ తీసుకున్న గోల్డ్..దీపావళి షాపింగ్ సందడి మెుదలెడదామా?

Gold Price Today: ప్రస్తుతం అంతర్జాతీయంగా పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్ఠాలకు చేరుకుని సామాన్యులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో నేడు గోల్డ్ ధరలు పెరుగుదలకు చిన్న బ్రేక్ తీసుకున్నాయని తెలుస్తోంది. అయితే భారీగా పెరిగిన ధరల వల్ల ఈ ఏడాది పండుగకు అమ్మకాలు 10 శాతానికి పైగా తగ్గవచ్చని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేటి తాజా ధరలను దేశీయంగా చూస్తే..

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7300, ముంబైలో రూ.7300, దిల్లీలో రూ.7315, కలకత్తాలో రూ.7300, బెంగళూరులో రూ.7300, కేరళలో రూ.7300, వడోదరలో రూ.7305, జైపూరులో రూ.7315, పాట్నాలో రూ.7305, మంగళూరులో రూ.7300, నాశిక్ లో రూ.7303, అయోధ్యలో రూ.7315, బళ్లారిలో రూ.7300, గురుగ్రాములో రూ.7315, నోయిడాలో రూ.7315 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రేట్లు జీఎస్టీ, పసిడి విక్రయదారుల లాభాలు, తరుగు మజూరి వంటి ఖర్చులకు ముందు రేటుగా గుర్తుంచుకోవాలి.

Gold rates took short break amid Dhanteras and Diwali 2024 nearing

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7964, ముంబైలో రూ.7964, దిల్లీలో రూ.7979, కలకత్తాలో రూ.7964, బెంగళూరులో రూ.7964, కేరళలో రూ.7964, వడోదరలో రూ.7969, జైపూరులో రూ.7979, పాట్నాలో రూ.7305, మంగళూరులో రూ.7964, నాశిక్ లో రూ.7967, అయోధ్యలో రూ.7979, బళ్లారిలో రూ.7964, గురుగ్రాములో రూ.7979, నోయిడాలో రూ.7979గా ఉన్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7964 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7964 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1000 పెరిగి నేడు రూ.1,10,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ధనత్రయోదశి ఎప్పుడు..
హిందువులు ఎక్కువగా ధనత్రయోదశిని ఘనంగా జరుపుకుంటుంటారు. దీపావళికి ముందు ధన్‌తేరస్ పేరుతో నిర్వహిస్తుంటారు. ఏటా ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి నాడు జరుపుకుంటుంటారు. ఈ క్రమంలో లక్ష్మీదేవితో పాటు కుభేరుడికి కూడా పూజిస్తుంటారు. హిందువలు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ధన త్రయోదశి అక్టోబర్ 29న వచ్చింది. ఈ రోజు కొత్తవస్తువులతో పాటు బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేయటం శుభప్రదంగా చాలా మంది భావిస్తుంటారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+