Gold Rate: పసిడి ప్రియులకు భారీ షాక్.. ఎవరెస్ట్ శిఖరానికి ధర.. బడ్జెట్ భయంతో రూ.9,200 అప్

Gold Price Today: బడ్జెట్ ప్రకటనలకు ముందుగానే ఆందోళనలు మెుదలయ్యాయి. ఈసారి బడ్జెట్లో పసిడి దిగుమతులపై సుంకాలను కేంద్ర ప్రభుత్వం పెంచనుందనే ఆందోళనల మధ్య గోల్డ్ ధరలు ఇండియాలో భారీగా పెరిగాయి. దీంతో పసిడి కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ చేసే ముందు ప్రజలు తాజా ధరలను తప్పక పరిశీలించాల్సిందే.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.8500 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7595, ముంబైలో రూ.7595, దిల్లీలో రూ.7610, కలకత్తాలో రూ.7595, బెంగళూరులో రూ.7595, కేరళలో రూ.7595, వడోదరలో రూ.7600, జైపూరులో రూ.7610, కోయంబత్తూరులో రూ.7595, మంగళూరులో రూ.7595, నాశిక్‌లో రూ.7598, అయోధ్యలో రూ.7610, నోయిడాలో రూ.7610, గురుగ్రాములో రూ.7610, బళ్లారిలో రూ.7595గా విక్రయాలు కొనసాగుతున్నాయి.

Gold rates sudden surge amid budget 2025 fears shocking Indian Buyers Know latest Hyderabad rates

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.9,200 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన నేటి రిటైల్ విక్రయ ధరలను పరిగణిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8285, ముంబైలో రూ.8285, దిల్లీలో రూ.8300, కలకత్తాలో రూ.8285, బెంగళూరులో రూ.8285, కేరళలో రూ.8285, వడోదరలో రూ.8290, జైపూరులో రూ.8300, కోయంబత్తూరులో రూ.8285, మంగళూరులో రూ.8285, నాశిక్‌లో రూ.7598, అయోధ్యలో రూ.8300, నోయిడాలో రూ.8300, గురుగ్రాములో రూ.8300, బళ్లారిలో రూ.8285గా ఉన్నాయి.

బడ్జెట్ భయాలు..
వాస్తవానికి గత బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం దిగుమతులపై సుంకాన్ని భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వినియోగం భారీగా పెరగటంతో దిగుమతులు పెరిగాయనే వాదన వినిపిస్తోంది. అయితే దీనిని అదుపుచేసేందుకు ఈసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పసిడి దిగుమతులపై భారీగా పన్నులను పెంచవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది దిగుమతులు పెరుగుదలతో ట్రేడ్ డెఫిసిట్ పెంచుతోందని నిపుణులు వాదిస్తున్నారు. ప్రస్తుతం డాలర్ ధర బలంగా ఉండటంతో పాటు రూపాయి మారకపు విలువ పడిపోవటం ఆర్థిక లోటును మరింతగా పెంచుతోందని నిపుణులు చెప్పటం భయాలకు కారణంగా తెలుస్తోంది.

హైదరాబాదులో పసిడి ధరలు..
ఇదే క్రమంలో తెలంగాణలోని.. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7595గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8285 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి తగ్గి నేడు రూ.1,04,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+