Gold Price Today: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడానికి కేవలం 4 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ క్రమంలో పసిడి ధరలు నిరంతరాయంగా పెరుగుతూనే ఉన్నాయి. జనవరి 1 నుంచి పసిడి పరుగులు భారతీయ మధ్యతరగతికి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇకపై గోల్డ్ కొనుగోలు కలగానే మారుతుందా అనే అనుమానాలు రేకెత్తిస్తోంది.
గోల్డ్ రేట్లు బీభత్సం.. పెరుగుదలకు కారణాలు..?
ట్రంప్ విధానాలు రాబోయే కాలంలో అమలు మార్కెట్లపై పెద్ద ప్రభావాన్ని చూపనుంది. దీంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగితే బంగారం తీవ్ర ఆందోళన నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఈ పరిస్థితులు రిటైల్ వినియోగదారులకు ఆందోళనకరమైన అంశంగా ఉంది. అయితే పెట్టుబడులు పెట్టేవారికి గోల్డ్ ఈ కాలంలో కొంత లాభాలను అందించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే పసిడి ధరల పెరుగుదలకు ముఖ్య కారణం అమెరికాలో కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ప్రభుత్వం ఎకనమిక్ పాలసీలపై అంచనాలు పసిడి ధరలను పెంచుతోంది.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1,000 పెరుగుదలను చూసింది. వాస్తవానికి నిన్న బ్రేక్ తీసుకున్న ధరల పెరుగుదల నేడు తిరిగి పుంజుకోవటంతో పండుగల జోరు సంతోషం ఆవిరయ్యింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7340, ముంబైలో రూ.7340, దిల్లీలో రూ.7355, కలకత్తాలో రూ.7340, బెంగళూరులో రూ.7340, కేరళలో రూ.7340, వడోదరలో రూ.7345, జైపూరులో రూ.7355, లక్నోలో రూ.7355, మంగళూరులో రూ.7340, నాశిక్ లో రూ.7332, అయోధ్యలో రూ.7355, నోయిడాలో రూ.7355, గురుగ్రాములో రూ.7355 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలను పరిశీలిస్తే.. 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ధర రూ.1100 పెరిగింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8007, ముంబైలో రూ.8007, దిల్లీలో రూ.8022, కలకత్తాలో రూ.8007, బెంగళూరులో రూ.8007, కేరళలో రూ.8007, వడోదరలో రూ.8012, జైపూరులో రూ.8022, లక్నోలో రూ.8022, మంగళూరులో రూ.8007, నాశిక్ లో రూ.7998, అయోధ్యలో రూ.8022, నోయిడాలో రూ.8022, గురుగ్రాములో రూ.8022గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7340గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8007 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7340గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8007 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 పెరిగి రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications