Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. ఒక్క రోజులో గోల్డ్ యూటర్న్, నేడు రూ.4,000 పెరిగిన రేటు

Gold Price Today: నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-భారత ప్రధాని నరేంద్ర మోదీ దైపాక్షిక చర్చల్లో భాగంగా కలవనున్నారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం అరికట్టేందుకు ఇది పునాది వేస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో నిన్న బ్రేక్ తీసుకున్న గోల్డ్ రేట్లు నేడు తిరిగి పుంజుకుని సామాన్య కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి.

లక్షకు చేరనున్న పసిడి..
ఈ క్రమంలో రానున్న కొన్ని నెలల్లో గోల్డ్ రిటైల్ విక్రయ ధర 10 గ్రాములకు లక్ష మార్కును చేరుకుంటుందా అనే డిబేస్ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న ధర నుంచి లక్ష మార్కును చేరుకోవటానికి పసిడి కేవలం 16 శాతం లేదా రూ.14,000 మాత్రమే దూరంలో ఉంది. ఇది అందుకోవటం అసాధ్యమైనది కాదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత స్థాయిలో పసిడి ధరల ర్యాలీ కొనసాగితే రానున్న కొన్ని నెలల కాలంలోనే గోల్డ్ రేటు రూ.లక్ష మార్కును చేరుకోవటం సులువేనని అంటున్నారు. మరోపక్క ఎంసీఎక్స్ లో పసిడి ధర మంగళవారం ఏప్రిల్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.86,360ని తాకి సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకేసింది.

Gold rates shocking buyers with rally again after a fall Know latest rates in Hyderabad

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.4000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7980, ముంబైలో రూ.7980, దిల్లీలో రూ.7995, కలకత్తాలో రూ.7980, బెంగళూరులో రూ.7980, కేరళలో రూ.7980, వడోదరలో రూ.7985, జైపూరులో రూ.7995, లక్నోలో రూ.7995, కోయంబత్తూరులో రూ.7980, మంగళూరులో రూ.7980, నాశిక్ లో రూ.7983, అయోధ్యలో రూ.7995, బళ్లారిలో రూ.7980, గురుగ్రాములో రూ.7995, నోయిడాలో రూ.7995 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటి కంటే 100 గ్రాములకు రూ.3800 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.8705, ముంబైలో రూ.8705, దిల్లీలో రూ.8720, కలకత్తాలో రూ.8705, బెంగళూరులో రూ.8705, కేరళలో రూ.8705, వడోదరలో రూ.8710, జైపూరులో రూ.8720, లక్నోలో రూ.8720, కోయంబత్తూరులో రూ.8705, మంగళూరులో రూ.8705, నాశిక్ లో రూ.8708, అయోధ్యలో రూ.8720, బళ్లారిలో రూ.8705, గురుగ్రాములో రూ.8720, నోయిడాలో రూ.8720 వద్ద కొనసాగుతున్నాయి.

గోల్డ్ రేట్ల ర్యాలీ..

ప్రస్తుతం పెరుగుతున్న పసిడి ధరలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి అమెరికా తాజా ట్రేడ్ టారిఫ్స్ కారణంగా ముందస్తు వ్యూహాత్మక రక్షణ చర్యల్లో భాగంగా చైనా నుంచి పసిడి డిమాండ్ పెరగటంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. ప్రస్తుతం చైనా-యూఎస్ ట్రేడ్ వార్ కారణంగా అప్రమత్తమైన ప్రపంచ దేశాల నుంచి కూడా పసిడికి డిమాండ్ పెరుగుతోంది. ఈ కారణాలతో గోల్డ్ రేట్లు సామాన్యులకు అందనంత స్థాయిలకు పెరిగిపోయాయి.

తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7980గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8705 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+