Gold Rates: రేట్లు కొంత తగ్గాక బంగారం కొనాలని గతంలో వాయిదా వేసుకున్న వారికి ఇదే సరైన సమయం అని చెప్పుకోవచ్చు. గత కొంత కాలంగా పసిడి ధరలు క్షీణిస్తున్నాయి. డిమాండ్ మాత్రం తక్కువగా ఉంది.
ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు స్వల్పంగా రూ.100 మేర పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.54,520, ముంబైలో రూ.54,150, దిల్లీలో రూ.54,300, కలకత్తాలో రూ.54,150, బెంగళూరులో రూ.54,150, వడోదరలో రూ.54,200, అహ్మదాబాదులో రూ.54,200, జైపూర్ లో రూ.54,300, కోయంబత్తూరులో రూ.54,520, పూణేలో రూ.54,150, నాశిక్ లో రూ.54,180, బళ్లారిలో రూ.54,150, అమరావతిలో రూ.54,150 వద్ద కొనసాగుతున్నాయి.

24 క్యారెట్ల పసిడి ధరను పరిశీలిస్తే.. 10 గ్రాములకు రూ.100 పెరిగింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,450, ముంబైలో రూ.59,060, దిల్లీలో రూ.59,220, కలకత్తాలో రూ.59,060, బెంగళూరులో రూ.59,060, వడోదరలో రూ.59,120, అహ్మదాబాదులో రూ.59,120, జైపూర్ లో రూ.59,220, కోయంబత్తూరులో రూ.59,450, పూణేలో రూ.59,060, నాశిక్ లో రూ.59,090, బళ్లారిలో రూ.59,060, అమరావతిలో రూ.59,060 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, అనంతపురంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,150గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.59,060గా ఉంది. తెలంగాణలోని నగరాల్లో సైతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర నిన్నటితో పోల్చితే రూ.200 క్షీణించింది. తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి రేటు రూ.75,800గా ఉంది.


Click it and Unblock the Notifications