Gold Prices: వారాంతం వచ్చేస్తోంది. చాలా మంది మహిళలు షాపింగ్ మెుదలు పెట్టే ముందు మారిన బంగారం ధరలను తెలుసుకోవటం చాలా ముఖ్యం. నిన్నటితో పోల్చితే గోల్డ్ ప్రైస్ స్వల్పంగా పెరిగినందున తెలుగు రాష్ట్రాల్లో ధరలను తెలుసుకుందాం..
22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే కిలోకు రూ.4,000 పెరిగి రూ.5,51,000కు చేరుకుంది. ఇదే క్రమంలో 24 క్యారెట్ల బంగారం ధర కిలోకు రూ.4,400 పెరగటంతో ధర రూ.6,01,100కు చేరుకుంది. ఇదే సమయంలో కిలో వెండి ధరను పరిశీలిస్తే ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కిలో రూ.73,100 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,420, ముంబైలో రూ.55,100, దిల్లీలో రూ.55,250, కలకత్తాలో రూ.55,100, బెంగళూరులో రూ.55,150, కేరళలో రూ.55,100, పూణేలో రూ.55,100, వడోదరలో రూ.55,150, జైపూర్ లో రూ.55,250, కోయంబత్తూరులో రూ.55,420, పూణేలో రూ.55,150, సూరత్ లో రూ.55,150, నోయిడాలో రూ.55,250గా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో నగరాల వారీగా 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,460, ముంబైలో రూ.60,110, దిల్లీలో రూ.60,260, కలకత్తాలో రూ.60,110, బెంగళూరులో రూ.60,160, కేరళలో రూ.60,110, పూణేలో రూ.60,110, వడోదరలో రూ.60,160, జైపూర్ లో రూ.60,260, కోయంబత్తూరులో రూ.60,460, పూణేలో రూ.60,160, సూరత్ లో రూ.60,160, నోయిడాలో రూ.60,260గా ఉన్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో నేటి గోల్డ్ రేట్లను పరిశీలిస్తే.. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ లలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,100గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.60,110గా ఉంది. ఇక ఏపీలోని నగరాలైన విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ నగరాల్లో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications