Gold Rate: బడ్జెట్ రోజు మళ్లీ పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో నేడు పెరిగిన రేట్లివే.. తులానికి..

Gold Price Today: నేడు బడ్జెట్ ప్రసంగం కోసం దేశం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా పెరుగుతున్న పసిడి రేట్లతో ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఈసారి బడ్జెట్లో బంగారం దిగుమతులపై పన్ను రేట్లను పెంచవచ్చనే భయాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. జూలైలో బడ్జెట్ ప్రకటన సమయంలో కేంద్ర దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.1500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరుగుతున్న రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7745, ముంబైలో రూ.7745, దిల్లీలో రూ.7760, కలకత్తాలో రూ.7745, కేరళలో రూ.7745, బెంగళూరులో రూ.7745, వడోదరలో రూ.7750, జైపూరులో రూ.7760, మంగళూరులో రూ.7745, నాశిక్ లో రూ.7748, అయోధ్యలో రూ.7760, బళ్లారిలో రూ.7745, గురుగ్రాములో రూ.7760, నోయిడాలో రూ.7760 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

Gold rates rose amid union budget import duty hike fears Know Hyderabad latest Rates

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1600 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8449, ముంబైలో రూ.8449, దిల్లీలో రూ.8464, కలకత్తాలో రూ.8449, కేరళలో రూ.8449, బెంగళూరులో రూ.8449, వడోదరలో రూ.8454, జైపూరులో రూ.8464, మంగళూరులో రూ.8449, నాశిక్ లో రూ.8437, అయోధ్యలో రూ.8464, బళ్లారిలో రూ.8449, గురుగ్రాములో రూ.8464, నోయిడాలో రూ.8464గా ఉన్నాయి. అయితే ఈ ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి, వ్యాపారి లాభాలు వంటివి కలపకముందువిగా గుర్తుంచుకోవాలి.

మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7745గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8449 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7745గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8449 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+