Gold Rate: ధనవంతులు కూడా కొనలేని స్థాయికి గోల్డ్.. నేడు రూ.3,900 పెరిగిన పసిడి ధర, తులం రేటు..

Gold Price Today: రోజులు మారుతున్నా పసిడి ధరలు మాత్రం చల్లారటం లేదు. నిరంతరాయంగా పెరుగుతూపోతున్న ధరలతో సామాన్యులు గోల్డ్ కొనటం కలగా మారుతోందని అంటున్నారు. వరుసగా పెరుగుతున్న ధరలను చూసి ధనవంతులు సైతం గందరగోళానికి గురవుతున్నారు. ఈ క్రమంలో నేడు పెరిగిన రిటైల్ ధరలను గమనించాకే కొనుగోలు చేయండి.

గోల్డ్ రేట్ల ర్యాలీ ఎందుకు..?
ప్రస్తుతం పెరుగుతున్న పసిడి ధరలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి అమెరికా తాజా ట్రేడ్ టారిఫ్స్ కారణంగా ముందస్తు వ్యూహాత్మక రక్షణ చర్యల్లో భాగంగా చైనా నుంచి పసిడి డిమాండ్ పెరగటంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. ప్రస్తుతం చైనా-యూఎస్ ట్రేడ్ వార్ కారణంగా అప్రమత్తమైన ప్రపంచ దేశాల నుంచి కూడా పసిడికి డిమాండ్ పెరుగుతోంది. దీనికి అదనంగా అమెరికా జాబ్ డేటా, ద్రవ్యోల్బణం, నెమ్మదిగా కొనసాగుతున్న ఆర్థిక వ్యవస్థ వంటి ఇతర కారణాలు సైతం పసిడి పరుగుకు కారణంగా ఉన్నాయి.

Gold Rates in India Shocking Rich people too with Sharp rise continuing Know Hyderabad Rates

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన గోల్డ్ విక్రయ రిటైల్ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7980, ముంబైలో రూ.7980, దిల్లీలో రూ.7995, కలకత్తాలో రూ.7980, బెంగళూరులో రూ.7980, కేరళలో రూ.7980, పూణేలో రూ.7980, వడోదరలో రూ.7985, జైపూరులో రూ.7995, లక్నోలో రూ.7995, కోయంబత్తూరులో రూ.7980, మంగళూరులో రూ.7980, నాశిక్ లో రూ.7983, మైసూరులో రూ.7980, అయోధ్యలో రూ.7995, బళ్లారిలో రూ.7980, నోయిడాలో రూ.7995, గురుగ్రాములో రూ.7995 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.3900 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన పసిడి రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8706, ముంబైలో రూ.8706, దిల్లీలో రూ.8721, కలకత్తాలో రూ.8706, బెంగళూరులో రూ.8706, కేరళలో రూ.8706, పూణేలో రూ.8706, వడోదరలో రూ.8711, జైపూరులో రూ.8721, లక్నోలో రూ.8721, కోయంబత్తూరులో రూ.8706, మంగళూరులో రూ.8706, నాశిక్ లో రూ.8709, మైసూరులో రూ.8706, అయోధ్యలో రూ.8721, బళ్లారిలో రూ.8706, నోయిడాలో రూ.8721, గురుగ్రాములో రూ.8721 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి, వ్యాపారి లాభాలు వంటివి కలపకముందువిగా గుర్తుంచుకోవాలి.

ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7980గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8706 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+