Gold Price Today: ఈవారం మధ్యలో ఒక్కసారి తగ్గిన గోల్డ్ రేట్లు అందరికీ ఉపశమనాన్ని ఇచ్చాయి. మరింతగా ధరల పతనం ఉంటుందని భారతీయ పసిడి ప్రియులు అంచనా వేశారు. అయితే దీని తర్వాత నిన్నటి నుంచి విలువైన లోహాల ధరలు తిరిగి భారీగా పెరుగుదలను చూస్తున్నాయి. దీంతో మార్కెట్లో పెద్ద అలజడి మెుదలైంది. పైగా వారాంతం వచ్చేసరికి పెరిగిన రేట్లు కొనుగోలుదారులను దీపావళి, ధనత్రయోదశికి ముందు గందరగోళానికి గురిచేస్తున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.6500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7360, ముంబైలో రూ.7360, దిల్లీలో రూ.7375, కలకత్తాలో రూ.7360, బెంగళూరులో రూ.7360, కేరళలో రూ.7360, వడోదరలో రూ.7300, అహ్మదాబాదులో రూ.7300, జైపూరులో రూ.7375, లక్నోలో రూ.7375, మంగళూరులో రూ.7360, నాశిక్ లో రూ.7263, మైసూరులో రూ.7360, అయోధ్యలో రూ.7375, బళ్లారిలో రూ.7360, గురుగ్రాములో రూ.7375, నోయిడాలో రూ.7375 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.7100 పెరుగుదలను చూసింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8029, ముంబైలో రూ.8029, దిల్లీలో రూ.8044, కలకత్తాలో రూ.8029, బెంగళూరులో రూ.8029, కేరళలో రూ.8029, వడోదరలో రూ.7963, అహ్మదాబాదులో రూ.8034, జైపూరులో రూ.8044, లక్నోలో రూ.8044, మంగళూరులో రూ.8029, నాశిక్ లో రూ.8032, మైసూరులో రూ.8029, అయోధ్యలో రూ.8044, బళ్లారిలో రూ.8029, గురుగ్రాములో రూ.8044, నోయిడాలో రూ.8044గా ఉన్నాయి. అయితే ఇవి చట్టపరమైన పన్నులు, వ్యాపారి లాభాలు, తరుగు మజూరి వంటి ఖర్చులను జోడించక మునుపటి ధరలుగా గుర్తుంచుకోండి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7360గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8029 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7360గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8029 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు, మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది. పైగా పండుగ దగ్గరపడుతున్న కొద్ది రేట్లు కొత్త గరిష్ఠాలను తాకుతున్నాయి.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications