Gold Price Today: ఇన్నాళ్లుగా పెరుగుతున్న పసిడి ధరలు సామాన్యులకు ఆందోళనల కలిగించేవి. కానీ ఇప్పుడు బంగారం షాపు యజమానులతో పాటు ధనవంతులకు సైతం నిరంతరం పెరుగుతున్న పసిడి ధరలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో పండుగకు ముందు షాపింగ్ చేయాలని చూస్తున్న భారతీయులకు రేట్లు ఆందోళన కలిగిస్తున్నాయి.
వాస్తవానికి ప్రస్తుతం భారతీయ పసిడి వ్యాపారం పెద్ద షాక్ కి గురవుతోంది. ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు ఆభరణాల కొనుగోలుకు రేట్ల పెరుగుదలతో దూరంగా వెళుతున్నారు. ఇదే క్రమంలో రోజురోజుకూ తగ్గుతున్న వ్యాపారం గోల్డ్ షాపు యజమానులను సైతం ఆందోళనలకు గురిచేస్తోంది. ఈ క్రమంలో చాలా మంది వ్యాపారులు తక్కువ లాభాల మార్జిన్ పెట్టుకుని వ్యాపారం చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. షాపులకు వస్తున్న కొనుగోలుదారుల సంఖ్య భారీగా క్షీణించిందని వారు చెబుతున్నారు.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3000 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గ్రాముకు పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7970, ముంబైలో రూ.7970, దిల్లీలో రూ.7985, కలకత్తాలో రూ.7970, బెంగళూరులో రూ.7970, హైదరాబాదులో రూ.7970, కేరళలో రూ.7970, వడోదరలో రూ.7975, అహ్మదాహబాదులో రూ.7975, జైపూరులో రూ.7985, లక్నోలో రూ.7985, మంగళూరులో రూ.7970, నాశిక్ లో రూ.7973, మైసూరులో రూ.7970, అయోధ్యలో రూ.7985, బళ్లారిలో రూ.7970, గురుగ్రాములో రూ.7985, నోయిడాలో రూ.7985 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3,300 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8695, ముంబైలో రూ.8695, దిల్లీలో రూ.8710, కలకత్తాలో రూ.8695, బెంగళూరులో రూ.8695, హైదరాబాదులో రూ.8695, కేరళలో రూ.8695, వడోదరలో రూ.8700, అహ్మదాహబాదులో రూ.8700, జైపూరులో రూ.8710, లక్నోలో రూ.8710, మంగళూరులో రూ.8695, నాశిక్ లో రూ.8698, మైసూరులో రూ.8695, అయోధ్యలో రూ.8710, బళ్లారిలో రూ.8695, గురుగ్రాములో రూ.8710, నోయిడాలో రూ.8710గా ఉంది.
మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్మార్ట్ కమోడిటీ రీసెర్చ్కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7970గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8695 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,08,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications