Gold Rate: గోల్డ్ టార్చర్ 2.0.. నెత్తిబాదుకుంటున్న పసిడి ప్రియులు, నేడు రూ.3,300 అప్..

Gold Price Today: ఈవారం ప్రారంభం నుంచి బంగారం ధరలు ఊహించని మలుపు తిరిగాయి. గతవారం వరుసగా పడిపోయిన గోల్డ్ ధరలు పతనాన్ని చూసిన భారతీయ కొనుగోలుదారులు ఈవారం మరింతగా రేట్లు తగ్గుతాయని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా రివర్స్ అయ్యాయి. కార్తీకమాసంలో పెళ్లిళ్లతోపాటు ఇతర శుభకార్యాలకు షాపింగ్ ఆలస్యం చేసిన చాలా మంది రేట్లు పెరగటంతో లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో గోల్డ్ షాపుకు వెళ్లటానికి ముందు నేడు పెరిగిన రిటైల్ విక్రయ ధరలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పనిసరిగా గుర్తించాల్సి ఉంటుంది.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.3,000 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7145, ముంబైలో రూ.7145, దిల్లీలో రూ.7160, కలకత్తాలో రూ.7145, బెంగళూరులో రూ.7145, కేరళలో రూ.7145, పూణేలో రూ.7145, వడోదరలో రూ.7150, అహ్మదాబాదులో రూ.7150, జైపూరులో రూ.7160, లక్నోలో రూ.7160, కోయంబత్తూరులో రూ.7145, మంగళూరులో రూ.7145, నాశిక్ లో రూ.7148, మైసూరులో రూ.7145, అయోధ్యలో రూ.7160, బళ్లారిలో రూ.7145, నోయిడాలో రూ.7160, గురుగ్రాములో రూ.7160 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

Gold rates continuing its bull run shocking indian buyers amid Wedding shopping continuing

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.3300 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిగణిస్తే.. చెన్నైలో రూ.7795, ముంబైలో రూ.7795, దిల్లీలో రూ.7810, కలకత్తాలో రూ.7795, బెంగళూరులో రూ.7795, కేరళలో రూ.7795, పూణేలో రూ.7795, వడోదరలో రూ.7800, అహ్మదాబాదులో రూ.7800, జైపూరులో రూ.7810, లక్నోలో రూ.7810, కోయంబత్తూరులో రూ.7795, మంగళూరులో రూ.7795, నాశిక్ లో రూ.7798, మైసూరులో రూ.7795, అయోధ్యలో రూ.7810, బళ్లారిలో రూ.7795, నోయిడాలో రూ.7810, గురుగ్రాములో రూ.7810 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7145గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7795 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7145గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7795 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+