బంగారం ప్రియులకు గుడ్ న్యూస్! పసిడి పరుగుకు బ్రేక్.. కానీ వెండి ధరలు మాత్రం ఆకాశానికి..
మీరు బంగారం లేదా నగలు కొనే ప్లాన్లో ఉన్నారా? అయితే మీకు ఇది ఒక రకమైన ఊరట కలిగించే వార్తే. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. గరిష్ట స్థాయిల నుంచి బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు మంచి అవకాశమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, వెండి మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా మళ్ళీ పెరిగింది.
ఎందుకు తగ్గాయి.. ఎందుకు పెరుగుతున్నాయి?
అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా విధిస్తున్న సుంకాలు, డాలర్ విలువలో మార్పులు, యుద్ధ మేఘాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావంతో బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. అయితే తాజాగా దేశీయ మార్కెట్లో కొంచెం సర్దుబాటు జరగడంతో ధరలు కాస్త శాంతించాయి. ఇది పసిడి ప్రియులకు ఖచ్చితంగా ఊరటనిచ్చే విషయమే.

హైదరాబాద్లో నేటి బంగారం ధరలు (Gold Rate Today)
ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి మన హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్లో ఈరోజు (డిసెంబర్ 21) బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
- 24 క్యారెట్ల బంగారం: బంగారం ధర ఎటువంటి మార్పు లేకుండా రూ. 1,34,180 (10 గ్రాములు) వద్ద ట్రేడవుతోంది.
- 22 క్యారెట్ల బంగారం (ఆభరణాల బంగారం): బంగారం ధర స్థిరంగా రూ. 1,23,000 (10 గ్రాముల) వద్ద కొనసాగుతోంది.
మీరు పెళ్లిళ్ల సీజన్ కోసం నగలు చేయించుకోవాలనుకుంటే, ధరలు స్థిరంగా ఉన్న ఈ సమయం మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు.
ప్రధాన నగరాల్లో ఇలా..
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
- చెన్నై (Chennai): 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,35,280 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,24,000 వద్ద కొనసాగుతోంది.
- ముంబై (Mumbai): 24 క్యారెట్ల ధర రూ. 1,34,180 గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,23,000 వద్ద ఉంది.
- ఢిల్లీ (Delhi): 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,330 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,23,150 వద్ద ట్రేడవుతోంది.
- కోల్కతా (Kolkata): 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ. 1,34,180 ఉండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రూ. 1,23,000 వద్ద ట్రేడవుతోంది.
- బెంగళూరు (Bangalore): ఇక్కడ 24 క్యారెట్ల ధర రూ. 1,34,180 గా మరియు 22 క్యారెట్ల ధర రూ. 1,23,000 గా స్థిరంగా ఉన్నాయి.
వెండి ధర ఆకాశానికి.. ఏకంగా రూ. 5000 పెరుగుదల!
బంగారం ధర నిలకడగా ఉంటే, వెండి మాత్రం చుక్కలను తాకుతోంది. ఈ ఒక్కరోజే కిలో వెండిపై ఏకంగా రూ. 5,000 పెరగడం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 2,26,000 కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ రేటు పెరగడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ ప్రకారం చూస్తే.. వెండి కొనాలనుకునే వారు మరికొన్ని రోజులు వేచి చూడటం ఉత్తమమని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications