Gold Price Today: ఈవారం మెుదటి రెండు రోజులు భారీగా క్షీణతను చూసిన పసిడి ధరలు నేడు తిరిగి పెరగటం ప్రారంభించాయి. అయితే గత రెండు రోజులు భారీగా పసిడి ధరల పతనం కొనసాగటంతో సంతోషంలో ఉన్న భారతీయ కొనుగోలుదారులు.. ప్రస్తుతం తిరిగి పెరుగుతున్న ధరలతో కొత్త ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఈ పెరుగుదలతో పెళ్లిళ్లు చేసుకునే కుటుంబాలు తమ వద్ద వినియోగంలో లేని పాత బంగారాన్ని కరిగించటం లేదా ఎక్స్ఛేంజ్ స్కీమ్ కింద షాపుల్లో ఇచ్చి దానికి బదులుగా కొత్త ఆభరణాలను కొనుగోలు చేయటానికి ఎక్కువగా ఉత్సాహం చూపుతున్నారని ప్రస్తుత ధోరణిని గమనించిన నిపుణులు చెబుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2,500 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7105, ముంబైలో రూ.7105, దిల్లీలో రూ.7094, కలకత్తాలో రూ.7105, బెంగళూరులో రూ.7105, కేరళలో రూ.7105, వడోదరలో రూ.7084, అహ్మదాబాదులో రూ.7084, జైపూరులో రూ.7094, లక్నోలో రూ.7094, కోయంబత్తూరులో రూ.7105, మంగళూరులో రూ.7105, నాశిక్ లో రూ.7108, మైసూరులో రూ.7105, అయోధ్యలో రూ.7094, బళ్లారిలో రూ.7105, గురుగ్రాములో రూ.7094, నోయిడాలో రూ.7094 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.2,700 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7751, ముంబైలో రూ.7751, దిల్లీలో రూ.7738, కలకత్తాలో రూ.7751, బెంగళూరులో రూ.7751, కేరళలో రూ.7751, వడోదరలో రూ.7728, అహ్మదాబాదులో రూ.7728, జైపూరులో రూ.7738, లక్నోలో రూ.7738, కోయంబత్తూరులో రూ.7751, మంగళూరులో రూ.7751, నాశిక్ లో రూ.7754, మైసూరులో రూ.7751, అయోధ్యలో రూ.7738, బళ్లారిలో రూ.7751, గురుగ్రాములో రూ.7738, నోయిడాలో రూ.7738గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7105గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7751 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7105గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7751 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.100 తగ్గి రూ.97,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.
More From GoodReturns

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications