Gold Rate: 3వ రోజు మోసం చేసిన గోల్డ్.. నేడు రూ.2700 అప్, రూటు మార్చేసిన పసిడి ప్రియులు

Gold Price Today: ఈవారం మెుదటి రెండు రోజులు భారీగా క్షీణతను చూసిన పసిడి ధరలు నేడు తిరిగి పెరగటం ప్రారంభించాయి. అయితే గత రెండు రోజులు భారీగా పసిడి ధరల పతనం కొనసాగటంతో సంతోషంలో ఉన్న భారతీయ కొనుగోలుదారులు.. ప్రస్తుతం తిరిగి పెరుగుతున్న ధరలతో కొత్త ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఈ పెరుగుదలతో పెళ్లిళ్లు చేసుకునే కుటుంబాలు తమ వద్ద వినియోగంలో లేని పాత బంగారాన్ని కరిగించటం లేదా ఎక్స్‌ఛేంజ్ స్కీమ్ కింద షాపుల్లో ఇచ్చి దానికి బదులుగా కొత్త ఆభరణాలను కొనుగోలు చేయటానికి ఎక్కువగా ఉత్సాహం చూపుతున్నారని ప్రస్తుత ధోరణిని గమనించిన నిపుణులు చెబుతున్నారు.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2,500 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7105, ముంబైలో రూ.7105, దిల్లీలో రూ.7094, కలకత్తాలో రూ.7105, బెంగళూరులో రూ.7105, కేరళలో రూ.7105, వడోదరలో రూ.7084, అహ్మదాబాదులో రూ.7084, జైపూరులో రూ.7094, లక్నోలో రూ.7094, కోయంబత్తూరులో రూ.7105, మంగళూరులో రూ.7105, నాశిక్ లో రూ.7108, మైసూరులో రూ.7105, అయోధ్యలో రూ.7094, బళ్లారిలో రూ.7105, గురుగ్రాములో రూ.7094, నోయిడాలో రూ.7094 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

Gold Rate started sudden rise on Wednesday Indian Buyers comes with alternate plans

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.2,700 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7751, ముంబైలో రూ.7751, దిల్లీలో రూ.7738, కలకత్తాలో రూ.7751, బెంగళూరులో రూ.7751, కేరళలో రూ.7751, వడోదరలో రూ.7728, అహ్మదాబాదులో రూ.7728, జైపూరులో రూ.7738, లక్నోలో రూ.7738, కోయంబత్తూరులో రూ.7751, మంగళూరులో రూ.7751, నాశిక్ లో రూ.7754, మైసూరులో రూ.7751, అయోధ్యలో రూ.7738, బళ్లారిలో రూ.7751, గురుగ్రాములో రూ.7738, నోయిడాలో రూ.7738గా ఉన్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7105గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7751 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7105గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7751 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.100 తగ్గి రూ.97,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+