Gold Price Today: ఈవారం మెుదటి రెండు రోజులు భారీగా క్షీణతను చూసిన పసిడి ధరలు నేడు తిరిగి పెరగటం ప్రారంభించాయి. అయితే గత రెండు రోజులు భారీగా పసిడి ధరల పతనం కొనసాగటంతో సంతోషంలో ఉన్న భారతీయ కొనుగోలుదారులు.. ప్రస్తుతం తిరిగి పెరుగుతున్న ధరలతో కొత్త ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఈ పెరుగుదలతో పెళ్లిళ్లు చేసుకునే కుటుంబాలు తమ వద్ద వినియోగంలో లేని పాత బంగారాన్ని కరిగించటం లేదా ఎక్స్ఛేంజ్ స్కీమ్ కింద షాపుల్లో ఇచ్చి దానికి బదులుగా కొత్త ఆభరణాలను కొనుగోలు చేయటానికి ఎక్కువగా ఉత్సాహం చూపుతున్నారని ప్రస్తుత ధోరణిని గమనించిన నిపుణులు చెబుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2,500 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7105, ముంబైలో రూ.7105, దిల్లీలో రూ.7094, కలకత్తాలో రూ.7105, బెంగళూరులో రూ.7105, కేరళలో రూ.7105, వడోదరలో రూ.7084, అహ్మదాబాదులో రూ.7084, జైపూరులో రూ.7094, లక్నోలో రూ.7094, కోయంబత్తూరులో రూ.7105, మంగళూరులో రూ.7105, నాశిక్ లో రూ.7108, మైసూరులో రూ.7105, అయోధ్యలో రూ.7094, బళ్లారిలో రూ.7105, గురుగ్రాములో రూ.7094, నోయిడాలో రూ.7094 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.2,700 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7751, ముంబైలో రూ.7751, దిల్లీలో రూ.7738, కలకత్తాలో రూ.7751, బెంగళూరులో రూ.7751, కేరళలో రూ.7751, వడోదరలో రూ.7728, అహ్మదాబాదులో రూ.7728, జైపూరులో రూ.7738, లక్నోలో రూ.7738, కోయంబత్తూరులో రూ.7751, మంగళూరులో రూ.7751, నాశిక్ లో రూ.7754, మైసూరులో రూ.7751, అయోధ్యలో రూ.7738, బళ్లారిలో రూ.7751, గురుగ్రాములో రూ.7738, నోయిడాలో రూ.7738గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7105గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7751 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7105గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7751 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.100 తగ్గి రూ.97,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications