Gold Rate: పసిడి ధరలు ప్రపంచ రికార్డ్.. నేడు రూ.8,700 అప్, ఇక కళ్లతో చూసి ఆనందించటమే..

Gold Price Today: పసిడి ధరలు నిరంతరం కొత్త గరిష్ఠాలకు చేరుకుంటూ అందరినీ హడలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ వాణిజ్య యుద్ధంతో తాజాగా ఎంసీఎక్స్ లో ఏప్రిల్ 4 కాంట్రాక్టు 10 గ్రాముల పసిడి రూ.86,360కి చేరుకుంది. దీంతో రికార్డు స్థాయిలో గోల్డ్ అనూహ్య పెరుగుదలను చూస్తోందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ ఔన్సు ధర 2968 డాలర్ల మార్కును తొలిసారి అందుకోవటం పసిడి ప్రియులను ఆశ్చర్యపరుస్తోంది.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.8,700 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.8060, ముంబైలో రూ.8060, దిల్లీలో రూ.8075, కలకత్తాలో రూ.8060, బెంగళూరులో రూ.8060, కేరళలో రూ.8060, వడోదరలో రూ.8065, జైపూరులో రూ.8075, అహ్మదాబాదులో రూ.8065, లక్నోలో రూ.8075, మంగళూరులో రూ.8060, నాశిక్ లో రూ.8063, మైసూరులో రూ.8060, అయోధ్యలో రూ.8075, బళ్లారిలో రూ.8060, గురుగ్రాములో రూ.8075, నోయిడాలో రూ.8075 వద్ద కొనసాగుతున్నాయి.

Gold Rate hit New Highs in MCX rates rise in Retail markets too fearing Indians Know AP TG Rates

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటి కంటే 100 గ్రాములకు రూ.8,000 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.8793, ముంబైలో రూ.8793, దిల్లీలో రూ.8808, కలకత్తాలో రూ.8793, బెంగళూరులో రూ.8793, కేరళలో రూ.8793, వడోదరలో రూ.8798, జైపూరులో రూ.8808, అహ్మదాబాదులో రూ.8798, లక్నోలో రూ.8808, మంగళూరులో రూ.8793, నాశిక్ లో రూ.8796, మైసూరులో రూ.8793, అయోధ్యలో రూ.8808, బళ్లారిలో రూ.8793, గురుగ్రాములో రూ.8808, నోయిడాలో రూ.8808గా ఉన్నాయి.

గోల్డ్ రేట్ల ర్యాలీ ఎందుకు..?
ప్రస్తుతం పెరుగుతున్న పసిడి ధరలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి అమెరికా తాజా ట్రేడ్ టారిఫ్స్ కారణంగా ముందస్తు వ్యూహాత్మక రక్షణ చర్యల్లో భాగంగా చైనా నుంచి పసిడి డిమాండ్ పెరగటంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. ప్రస్తుతం చైనా-యూఎస్ ట్రేడ్ వార్ కారణంగా అప్రమత్తమైన ప్రపంచ దేశాల నుంచి కూడా పసిడికి డిమాండ్ పెరుగుతోంది. దీనికి అదనంగా అమెరికా జాబ్ డేటా, ద్రవ్యోల్బణం, నెమ్మదిగా కొనసాగుతున్న ఆర్థిక వ్యవస్థ వంటి ఇతర కారణాలు సైతం పసిడి పరుగుకు కారణంగా ఉన్నాయి.

తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.8060గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8793 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+