ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర బ్యాంకులు, ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారం కొనుగోలులో స్వల్ప మార్గాన్ని అనుసరిస్తున్నాయి. ఆర్థిక నిపుణులు చెబుతున్నట్లుగా.. ఈ జాగ్రత్తపూర్వక ధోరణి ప్రధానంగా దీర్ఘకాలిక ఆస్తుల విభజన లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోందని చెప్పవచ్చు.
ప్రపంచ బంగారు మండలి (WGC) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2025 జూలైలో గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు నికరంగా 10 టన్నుల Gold మాత్రమే కొనుగోలు చేసాయి. ఇది గత నెలలతో పోలిస్తే..తక్కువని చెప్పవచ్చు. జూలై 2024లో ఉన్న దాని కంటే 70 శాతం తక్కువ. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (H1-January నుండి June వరకు ఉన్న కాలం) కేంద్ర బ్యాంకులు మొత్తం 123 టన్నులు బంగారం కొనుగోలు చేసినట్లు వివరించారు. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 130 టన్నుల కంటే తక్కువ అని చెప్పుకోవచ్చు.

కెనరా బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ మాధవన్కుట్టి తెలిపిర వివరాల ప్రకారం.. భౌగోళిక రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారితే.. Gold ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇది బంగారం నిల్వలను పెంచేందుకు అనుకూల సమయాన్ని సృష్టిస్తుంది. RBI కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తూ.. ప్రస్తుతం 880 టన్నుల రికార్డు స్థాయి బంగారు నిల్వలను కలిగి ఉంది. జూలై 2025లో RBI బంగారం నిల్వలో కొత్తగా బంగారం జోడించలేదు. దీనికి ప్రధాన కారణం మార్కెట్ పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిణామాల వల్ల అస్థిరత పెరగడం కారణమంటున్నారు.
ప్రస్తుతానికి.. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 3,600 డాలర్లు చేరువగా ఉన్నాయి. దీనికి ముఖ్య కారణంగా గ్లోబల్ వాణిజ్య యుద్ధాలు, ప్రత్యేకంగా భారతదేశం-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, కారణమని మాధవన్కుట్టి పేర్కొన్నారు, వాణిజ్య యుద్ధం తక్కువైనప్పుడు, బంగారం ధరలు తగ్గే అవకాశముందని.. ఇది మరింత స్థిరమైన బంగారం కొనుగోలుకు అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. అదేవిధంగా అమెరికన్ డాలర్ (USD) బలహీనపడినప్పుడు కూడా బంగారం ధరలు బలపడే ధోరణి ఉంది.
ఇప్పటికే, కొన్ని నెలలుగా ధర పెరుగుదలతో పాటు భారీ గ్లోబల్ ఆర్థిక ఒత్తిళ్లు కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోలు విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే, కేంద్ర బ్యాంకులు వ్యూహాత్మకంగా స్వల్ప నికర కొనుగోళ్ల ద్వారా రిస్క్ మేనేజ్మెంట్ విధానం పాటిస్తూ, ప్రస్తుత ధర పరిధిలో నిల్వలు నిలబెట్టుకునే దిశగా పనిచేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఆర్థిక మందగమనంతో పాటు గ్లోబల్ మార్కెట్ ధోరణుల మధ్య RBI, ఇతర కేంద్ర బ్యాంకుల జాగ్రత్తపూర్వక చర్యలు, బంగారం రంగంపై మిశ్రమ ప్రభావాన్ని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం సరైన సమయాన్ని ఎప్పుడైతే భావిస్తారో ఆ సమయంలో మళ్లీ బంగారం నిల్వలు పెరగవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.
కొనుగోలు ఆపడం వెనుక రెండు ముఖ్య కారణాలు
ధర స్థాయి అధికంగా ఉండటం : గ్లోబల్ మార్కెట్ లో ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. అధిక ధర వద్ద కొనుగోలు చేస్తే వచ్చే సంవత్సరాల్లో నిల్వ విలువ తగ్గే ప్రమాదం ఉంది.
భౌగోళిక రాజకీయ అనిశ్చితులు: భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం, యూరోప్లో సాన్నిధ్యమైన సంక్షోభాలు వంటి పరిస్థితులు ఆర్థిక అస్థిరతను పెంచుతున్నాయి. ప్రస్తుతం తక్షణ బంగారం నిల్వను పెంచడం కంటే, పరిస్థితులు స్థిరపడి తక్కువ ధరలలో మళ్లీ కొనుగోలు చేసే సమయం కోసం వేచి ఉండటం వ్యూహాత్మక నిర్ణయంగా RBI భావిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్పై RBI కఠిన ఆంక్షలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications