Gold Rate: పసిడి ప్రియుల అశలకు తూట్లు.. శుక్రవారం కైలాసానికి గోల్డ్ రేటు, రూ.8700 పెరిగిన ధర..

Gold Price Today: దేశీయంగా గోల్డ్ ధరలు అనేక అంతర్జాతీయ కారణాలతో ఈవారం మాత్రం దూకుడు మీద ఉన్నాయి. గతవారం ధరలు దాదాపు రూ.23,000 వేలకు పైగా పెరగటంతో కొనుగోలుదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ శుభకార్యాలకు ఆభరణాలను మంగళప్రదంగా శుక్రవారం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు. కానీ నేడు భారీగా ధరలు పెరగటంతో ఇంకా వేచిచూడాలా లేక ప్రస్తుత స్థాయిల వద్ద కొనుగోలు చేయాలా అనే గందరగోళంలో ఉన్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి విక్రయ ధరలను చూశాకే షాపులకు వెళ్లటం ముఖ్యం.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.8000 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ తాజా ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7225, ముంబైలో రూ.7225, దిల్లీలో రూ.7240, కలకత్తాలో రూ.7225, బెంగళూరులో రూ.7225, కేరళలో రూ.7225, పూణేలో రూ.7225, వడోదరలో రూ.7230, అహ్మదాబాదులో రూ.7230, జైపూరులో రూ.7240, కోయంబత్తూరులో రూ.7225, మధురైలో రూ.7225, మంగళూరులో రూ.7225, నాశిక్ లో రూ.7228, అయోధ్యలో రూ.7240, బళ్లారిలో రూ.7225, గురుగ్రాములో రూ.7240, నోయిడాలో రూ.7225 వద్ద నేడు విక్రయాలు కొనసాగుతున్నాయి.

Gold prices in skyrocking rally after huge fall in prices last week Indian Buyers in confusion

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే 100 గ్రాములకు ఏకంగా రూ.8700 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7882, ముంబైలో రూ.7882, దిల్లీలో రూ.7897, కలకత్తాలో రూ.7882, బెంగళూరులో రూ.7882, కేరళలో రూ.7882, పూణేలో రూ.7882, వడోదరలో రూ.7887, అహ్మదాబాదులో రూ.7887, జైపూరులో రూ.7897, కోయంబత్తూరులో రూ.7882, మధురైలో రూ.7882, మంగళూరులో రూ.7882, నాశిక్ లో రూ.7885, అయోధ్యలో రూ.7897, బళ్లారిలో రూ.7882, గురుగ్రాములో రూ.7897, నోయిడాలో రూ.7897గా ఉన్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7225గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7882 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7225గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7882 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+