ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు లేదా శుభకార్యాల సమయంలో బంగారం (gold) కొనడం ఒక సంప్రదాయం. అయితే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. మీరు రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే.. తప్పనిసరిగా పాన్ (PAN) లేదా ఆధార్ కార్డు వివరాలను జ్యువెలరీ షాపులో ఇవ్వాల్సి ఉంటుంది. 2016 జనవరి నుంచి ఈ నిబంధన అమలులో ఉంది. కానీ, అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో, బడ్జెట్ 2026 లో ఈ రూ. 2 లక్షల పరిమితిని పెంచాలని ట్యాక్స్ నిపుణులు , జ్యువెలరీ అసోసియేషన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

రూ. 2 లక్షల లిమిట్ ఎందుకు పెంచాలి?
చార్టర్డ్ అకౌంటెంట్ సురేష్ సురానా వంటి నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2016లో రూ. 2 లక్షలకు వచ్చే బంగారానికి, ఇప్పుడు వచ్చే బంగారానికి చాలా తేడా ఉంది. ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఇప్పుడు అతి తక్కువ బరువున్న నగలు కొన్నా కూడా ఈజీగా రూ. 2 లక్షల మార్కును దాటేస్తున్నాయి. దీనివల్ల సాధారణ మధ్యతరగతి ప్రజలు కూడా అనవసరంగా ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్టింగ్ పరిధిలోకి వస్తున్నారు. కేవలం ధర పెరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది తప్ప, కొనే పరిమాణం పెరగడం వల్ల కాదు. అందుకే ఈ లిమిట్ను కనీసం రూ. 5 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
పారదర్శకత , సామాన్యుడి ఇబ్బందులు
నిజానికి, ప్రభుత్వం ఈ రూ. 2 లక్షల నిబంధనను తీసుకువచ్చింది నల్లధనాన్ని అరికట్టడానికి. పెద్ద మొత్తంలో నగదుతో బంగారం కొనేవారిపై నిఘా ఉంచడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే, ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ పెరిగిన తర్వాత కూడా ఈ తక్కువ పరిమితి ఉండటం వల్ల చిన్న చిన్న వ్యాపారులు , సాధారణ కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. బడ్జెట్ 2026 లో ఈ పరిమితిని పెంచితే, మధ్యతరగతి కుటుంబాలకు పెళ్లిళ్ల సమయంలో కాస్త ఊరట లభిస్తుంది.
నిపుణుల ప్రతిపాదనలు ఏమిటి?
ఈ పరిమితిని కేవలం ఒక ఫిక్స్డ్ నెంబర్గా కాకుండా బంగారం ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే ధర పెరిగినప్పుడు లిమిట్ కూడా పెరగాలి. దీనివల్ల నిజంగా భారీ ఎత్తున పెట్టుబడి పెట్టే వారిని మాత్రమే ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్రాక్ చేయగలుగుతుంది. అలాగే జ్యువెలర్స్ కూడా ఎస్ఎఫ్టీ (SFT) రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు తక్కువ మొత్తాలకు సంబంధించి ఎక్కువ పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు.
మొత్తానికి బంగారం (gold) ధరలు 2026 లో రికార్డు స్థాయికి చేరుకున్న తరుణంలో ఈ పాత నిబంధనలు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బడ్జెట్ 2026 లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటే.. అది జ్యువెలరీ రంగానికి , సామాన్య వినియోగదారులకు పెద్ద బూస్ట్ అవుతుంది. అప్పుడు పాన్ కార్డు భయం లేకుండా మధ్యతరగతి ప్రజలు తమకు నచ్చిన నగలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications