బంగారం ధర భారీగా తగ్గబోతోంది.. కొంచెం వెయిట్ చేయాలంటున్న కామాఖ్య జ్యువెల్స్ సహ వ్యవస్థాపకుడు మనోజ్ ఝా

దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధరలు రికార్డు గరిష్టాలకు చేరిన నేపథ్యంలో.. పెట్టుబడిదారులు ఇప్పుడు కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కామాఖ్యా జ్యువెల్స్ సహ వ్యవస్థాపకుడు మనోజ్ ఝా సంచలన వ్యాఖ్యలు చేశారు. CNBC-TV18తో ఆయన మాట్లాడుతూ, బంగారం ఇప్పుడు బబుల్ జోన్ లోకి ప్రవేశించినట్లు తెలిపారు. రాబోయే నెలల్లో లాభాలను బుక్ చేసుకోవడం అవసరం ఏర్పడవచ్చు, ఎందుకంటే ఇప్పటి గరిష్ట స్థాయిల తర్వాత స్వల్పకాలిక తగ్గుదల ఉంటుందని తెలిపారు.

భారతదేశంలోని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో డిసెంబర్ డెలివరీ కోసం Gold ఫ్యూచర్స్ అక్టోబర్ 20న రూ. 129,700కి చేరాయి, అంటే 2.12 శాతం పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయంగా, స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు 4,253.33 డాలర్లకి పెరిగాయి. US డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.3 శాతం పెరుగుతూ 4,266.30 డాలర్లకి చేరాయి. US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అంచనాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, బంగారం పెరుగుదలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

gold price bubble gold correction 2025 gold price prediction Manoj Jha gold forecast Kamakhya Jewels gold news gold market analysis gold investment advice gold price drop gold price alert gold market volatility gold trading tips gold bubble warning gold market correction investment in gold gold prices 300- 400 correction gold market news India gold price trends gold investors alert precious metals market gold expert advice 2025 300- 400

మనోజ్ ఝా ప్రకారం గతంలో 1979-80, 2010-11లో కూడా బంగారం పెద్ద ర్యాలీలు చూశాయి, కానీ గరిష్ట స్థాయిల తర్వాత పెద్ద పతనం అనుభవించాయి. ఈ నేపథ్యంలో, పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియో కేటాయింపులను సవరిస్తున్నారు. సాధారణంగా వ్యక్తులు 10 నుంచి 12 శాతం Gold మీద కేటాయిస్తారు, అయితే ఇటీవలి ర్యాలీ తర్వాత ఇది 18 నుంచి 22 శాతానికి పెరిగింది. అంటే, ఎక్కువ మంది ఇప్పుడు లాభాలను బుక్ చేసుకోవాలనుకుంటున్నారు.

ఝా అంచనాల ప్రకారం బంగారం ధరలు సమీప భవిష్యత్తులో ఔన్సుకు (28.35 గ్రాములు) 300 నుంచి 400 డాలర్ల వరకు తగ్గవచ్చు. ఈ స్థాయిలో, కొత్త పెట్టుబడిదారులకు ఉచిత అవకాశాలు ఏర్పడతాయి. ధరలు స్థిరమైన తర్వాత దీర్ఘకాలిక పెట్టుబడిదారులు తిరిగి పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను పొందగలుగుతారని తెలిపారు.

ఇక భారతదేశంలో పండుగ సీజన్, దీర్ఘకాలిక డిమాండ్ బంగారం మార్కెట్‌ను మన్నింపజేస్తుంది. ఈ సంవత్సరం ధంతేరాస్ సందర్భంగా ఆభరణాల డిమాండ్ అంచనాలను మించి ఉంది. రికార్డు ధరలు ఉన్నప్పటికీ, అమ్మకాలు కేవలం 15 నుంచి 20 శాతం తగ్గాయి. బులియన్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 25 శాతం ఎక్కువ పెరిగాయని ఆయన తెలిపారు.

స్వల్పకాలిక తగ్గుదల మార్కెట్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పెట్టుబడిదారుల ఆసక్తిని కొనసాగిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించి, బంగారం ధరలు క్రమంగా స్థిరమైన తర్వాత తిరిగి పెట్టుబడులు పెట్టవచ్చని మనోజ్ ఝా సూచిస్తున్నారు. ఏదేమైనా బంగారం ఇప్పుడు బబుల్ జోన్‌లో ఉంది. కాబట్టి ఔన్సు 300 డాలర్ల నుంచి 400 డాలర్ల మధ్యలోకి వచ్చే అవకాశం అయితే ఉంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+