భారీగా తగ్గిన బంగారం దిగుమతులు, ఇన్వెస్టర్లు ఆచితూ...
2019-20 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో 27 బిలియన్ డాలర్ల (రూ.1.90 లక్షల కోట్ల) విలువైన పసిడి దిగుమతి అయింది.
YES bank crisis: గుడ్న్యూస్, 18న మారటోరియం ఎత్తివేత
బంగారం ఎఫెక్ట్.. తగ్గిన వాణిజ్య లోటు
అంతకుముందు ఏడాది ఇదే సమయంలో వచ్చిన 29.62 బిలియన్ డాలర్లతో పోలిస్తే 8.86% తగ్గింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్యలోటు 173 బిలియన్ డాలర్ల నుంచి 143.12 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు చెప్పింది.
ఇన్వెస్టర్లు ఆచితూచి
బంగారం ధర రికార్డ్ స్థాయిలో పుంజుకుంటుండటం, కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో గత ఏడాది డిసెంబర్ నుంచి పసిడి దిగుమతుల్లో ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకుంటోంది. దేశీయంగా ఆభరణాలకు అధికంగా డిమాండ్ ఉండటంతో భారత్ ప్రతి సంవత్సరం 800 నుంచి 900 టన్నులకు వరకు బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది.
CADను కట్టడి చేసేందుకు..
వాణిజ్య లోటు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ను (CAD) కట్టడి చేయడంలో భాగంగా కేంద్రం పసిడి దిగుమతులపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని 10 శాతం నుండి 12.5 శాతానికి పెంచింది. దీంతో ఈ రంగంలో ప్రతికూలత నమోదయింది. మరోవైపు జెమ్స్ అండ్ ఆభరణాల వర్తకులు ఈ సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు.