గత కొన్నాళ్లుగా రికార్డు స్థాయి లాభాలతో దూసుకుపోతున్న పసిడి పరుగుకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. కేవలం రెండు మూడు రోజుల్లోనే బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. ఈ ప్రభావం కమోడిటీ మార్కెట్పైనే కాకుండా గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF)ల పై కూడా గట్టిగా పడింది. కొన్ని ఫండ్స్ ఏకంగా 20 శాతం వరకు నష్టపోవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.

ఏమైంది ఈ మార్కెట్కు?
నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన ధరలు ఇప్పుడు పాతాళానికి ఎందుకు పడిపోతున్నాయి? దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీలు మారుతుండటంతో డాలర్ విలువ పెరిగింది. సాధారణంగా డాలర్ బలపడితే బంగారం ధరలు తగ్గుతాయి. దీనికి తోడు, ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున 'ప్రాఫిట్ బుకింగ్' (లాభాల స్వీకరణ) చేయడంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
కకావికలమైన Gold ETF , Silver ETFలు
ఈ ధరల పతనం వల్ల జీరోధా గోల్డ్ ఈటీఎఫ్, నిప్పాన్ ఇండియా, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ గోల్డ్ ఈటీఎఫ్ లు దాదాపు 9 శాతం వరకు నష్టపోయాయి. ఇక వెండి విషయానికి వస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. యాక్సిస్ సిల్వర్ ఈటీఎఫ్, ఎడెల్విస్ వంటివి ఏకంగా 20 శాతం లోయర్ సర్క్యూట్ను తాకాయి. అయితే మధ్యాహ్నం సమయానికి మార్కెట్ స్వల్పంగా కోలుకుని.. సుమారు 10 శాతం రికవరీ సాధించడం ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చే అంశం.
ధరల పతనం గణాంకాలు ఇలా ఉన్నాయి (MCX)..
మార్కెట్ ఒడిదుడుకులు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈ కింది లెక్కలు చూస్తే అర్థమవుతుంది..
• వెండి: కేవలం రెండు రోజుల్లోనే కేజీ వెండిపై రూ. 1.35 లక్షల మేర ధర తగ్గింది. జనవరి 30న వెండి ఏకంగా 27% పడిపోయి చరిత్రలోనే అత్యంత దారుణమైన పతనాన్ని చూసింది.
• బంగారం: అదే సమయంలో బంగారం ధర కూడా రూ. 31,000 వరకు తగ్గింది. ఏప్రిల్ ఫ్యూచర్స్ ధర రూ. 1,47,400 వద్ద ట్రేడ్ అవుతోంది.
BSE కీలక నిర్ణయం - సర్క్యూట్ లిమిట్స్
బంగారం, వెండి ధరల్లో ఇంతటి భారీ హెచ్చుతగ్గులు ఇన్వెస్టర్లను ముంచేయకుండా ఉండేందుకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) రంగంలోకి దిగింది. ఫిబ్రవరి 1 నుంచి గోల్డ్ , సిల్వర్ ఈటీఎఫ్లపై 20% సర్క్యూట్ పరిమితిని విధించింది. అంటే ధరలు ఒకే రోజులో 20 శాతం కంటే ఎక్కువ పెరగడానికి లేదా తగ్గడానికి వీలుండదు. ఇది ఇన్వెస్టర్ల సొమ్మును రక్షించడానికి తీసుకున్న నిర్ణయం.
ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?
ధరలు తగ్గుతున్నాయి కదా అని కంగారుపడి ఉన్న స్టాక్ ను తక్కువ ధరకే అమ్మేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇండస్ ఇండ్ సెక్యూరిటీస్ విశ్లేషకుల ప్రకారం.. చైనా మార్కెట్లో స్పెక్యులేటర్లు లాభాలు తీసుకోవడం వల్ల ఈ పతనం సంభవించింది.
- దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు: మీరు కనీసం 3 నుంచి 5 ఏళ్ల కోసం ఇన్వెస్ట్ చేస్తుంటే, ఇలాంటి స్వల్పకాలిక పతనాలను చూసి భయపడాల్సిన అవసరం లేదు.
- కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు: ధరలు తగ్గినప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ లో సిప్ (SIP) పద్ధతిలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి అవకాశం కావచ్చు.
అయితే వెండి ధరలు ఇంకా రూ. 2,45,000 వరకు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గుడ్డిగా పెట్టుబడి పెట్టకుండా ఆచితూచి అడుగు వేయడం ఉత్తమం.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications