జనవరి-మార్చిలో బంగారం డిమాండ్ భారీగా తగ్గింది, ఎందుకంటే

కరోనా థర్డ్ వేవ్, ఆ తర్వాత రష్యా - ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ నెలలోనే కాస్త తగ్గుముఖం పట్టాయి. 2022 క్యాలెండర్ ఏడాదిలో జనవరి నుండి మార్చి మధ్య కాలంలో పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టం సమీపానికి చేరడంతో పసిడి డిమాండ్ తగ్గింది. ప్రస్తుత క్యాలెండర్ ఏడాది తొలి మూడు నెలల్లో మన దేశంలో పసిడి డిమాండ్ 18 శాతం క్షీణించి 135.5 టన్నులకు తగ్గింది. 2021 జనవరి-మార్చి త్రైమాసికంలో 165.8 టన్నులుగా నమోదయింది. ఈ మేరకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) గురువారం తెలిపింది.

వ్యాల్యూ పరంగా బంగారం డిమాండ్ 12 శాతం తగ్గింది. 2022 మొదటి మూడు నెలల కాలంలో రూ.61,550 కోట్ల బంగారం విక్రయించగా, 2021 అదే సమయంలో రూ.69,720 కోట్ల పసిడిని విక్రయించారు. ఆభరణాలకు 26 శాతం డిమాండ్ తగ్గి 94.2 టన్నులకు పడిపోయింది. అయితే గత త్రైమాసికంలో బంగారంలో పెట్టుబడులు మాత్రం 2021 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 5 శాతం పెరగడం గమనార్హం.

Gold Demand In India Fell 18% Due To Rising Prices In First Quarter Of 2022

ధరల పెరుగుదలతో పాటు ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న అస్థిరత, రూపాయి క్షీణత కారణంగా సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడిలో పెట్టుబడులకు మొగ్గు చూపారు చాలామంది. మొదటి త్రైమాసికంలో బంగారు ఆభరణాల డిమాండ్ 100 టన్నుల కంటే తక్కువగా ఉండటం 2010 తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. జనవరి - మార్చి మధ్య మంచి రోజులు తక్కువగా ఉండటంతో శుభకార్యాలు తగ్గాయి. మరోవైపు బంగారం ధరలు భారీగా పెరిగాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+