ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్తితులు అనిశ్చితితో నిండిన సమయంలో.. డబ్బు విలువ తగ్గిపోతోంది. స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్నాయి. పలు దేశాల కరెన్సీలు పతనమవుతున్నాయి. ఇలాంటి సమయంలో బంగారం ఒక్కటే స్థిరంగా, విశ్వసనీయంగా నిలిచింది. ఈ కారణంగా పలు దేశాలు తమ భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం బంగారు నిల్వలను పెంచడం ప్రారంభించాయి. భారతదేశంలో కూడా ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 8, 2025 నాటికి దేశంలోని మొత్తం బంగారు నిల్వలను 880 టన్నులవరకు పెంచింది. ఈ నిల్వల్లో కొంత భాగం నాగ్పూర్, ముంబైలో నిల్వగా ఉండగా, మిగిలినవి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద ఉన్నాయి. గత దశాబ్దంలో భారతదేశం తన Gold నిల్వలను దాదాపు 58 శాతం పెంచింది. 2015లో 557.7 టన్నుల నిల్వ ఉన్నది. అది 2025 నాటికి అది 880 టన్నులవరకు చేరింది. ఈ పెరుగుదల ప్రత్యేకంగా 2022 తర్వాత వేగంగా జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బంగారాన్ని అత్యంత భద్రతా ఆస్తిగా పరిగణించింది.

బంగారం ధరలు కూడా ఈ ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.70 వేలుగా ట్రేడ్ అయ్యింది. 2025 నాటికి అదే 10 గ్రాములకు రూ. 1,28,000 దాటింది. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, ఆర్థిక మందగమనాలు, ద్రవ్యోల్బణం బంగారం విలువ పెరగడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.చైనా కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది.
2025 జనవరి నుండి సెప్టెంబర్ మధ్య బీజింగ్ 39.2 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. అక్టోబర్ 8 నాటికి చైనా మొత్తం Gold నిల్వలు 2,298.5 టన్నులకు చేరాయి. సగటున, చైనా ప్రతి నెలా 2-5 టన్నుల బంగారం జోడిస్తోంది. సెప్టెంబర్లో 0.4 టన్నుల కొద్ది కొనుగోలు నెమ్మదిగా ఉన్నప్పటికీ, దీని మొత్తం నిల్వ వేగవంతంగా పెరుగుతోంది.భారతదేశం, చైనా ఈ బంగారం నిల్వల వ్యూహం ద్వారా ఒక స్పష్టమైన సంకేతాన్ని ప్రపంచానికి పంపుతున్నాయి.
ఆర్థిక అస్థిరత, కరెన్సీ చలనాలు, మార్కెట్ ఊగిసలాటల్లో, నిజమైన భద్రతా శక్తి మెరిసే బంగారంలోనే ఉంది. ప్రతి కొత్త కడ్డీ కేంద్ర ఖజానాకు జోడించబడినప్పుడు, అది ఆ దేశాల భవిష్యత్ ఆర్థిక స్థిరత్వానికి, స్వతంత్ర వ్యూహాలకు సంకేతంగా మారుతోంది.సార్వత్రికంగా, భారతదేశం, చైనా వంటి దేశాలు బంగారం పై పెట్టుబడులను పెంచడం ద్వారా ఆర్థిక భద్రత, విలువ పరిరక్షణ, అంతర్జాతీయ సార్వభౌమాధికారం కోసం వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ప్రవర్తన ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది మరియు వచ్చే దశాబ్దంలో గ్లోబల్ గోల్డ్ మార్కెట్లో కీలక పరిణామాలు ఎదురవుతాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం, వెండి ధరలు ఢమాల్.. పసిడి ధరలపై ప్రభావం చూపని ఇరాన్ యుద్ధం..ఇప్పుడు ఏం చేయాలంటే..

బంగారం ధరలు ఈ వారం పెరుగుతాయా..తగ్గుతాయా.. ఆ మూడు ప్రపంచ బ్యాంకుల మీటింగ్పై నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర రూ.1.70 లక్షలు.. వెండి ధర రూ.3 లక్షలకు పెరుగుతుందా? పసిడి ర్యాలీపై ఆర్థిక నిపుణలు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం ధరలు.. కారణం ఏంటంటే..

Gold rates: పెరిగిందా.. తగ్గిందా? దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్ల వివరాలు ఇవే..

ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది.. ప్రపంచం మళ్లీ ప్రశాతంగా ఉంటుంది..ట్రంప కీలక వ్యాఖ్యలు

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. JP మోర్గాన్, గోల్డ్మన్ సాచ్స్ అంచనాలు చూస్తే వణుకు పుట్టడం ఖాయం..



Click it and Unblock the Notifications