Gold Rate: కొండెక్కిన పసిడి ధర.. నేడు ఏకంగా రూ.7,600 అప్, దేవుడా ఇక పెళ్లికి పుస్తెలు కొనలేరా..?

Gold Price Today: వాస్తవానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ 10 గ్రాముల బంగారంతో పాటు కేజీ వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ తగ్గింపులు మార్చి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. మంత్రిత్వ శాఖ దిగుమతి సుంకాలను 10 గ్రాముల బంగారంపై $11 తగ్గించి $927కు తగ్గించగా.. కిలో వెండిపై $18 తగ్గించటంతో $1,025కు చేరుకుంది. వాస్తవానికి దేశంలో రిటైల్ గోల్డ్ అండ్ సిల్వర్ ధరల నిర్ణయాలకు ఈ సుంకాలు కీలక పాత్ర పోషిస్తాయి. పెళ్లిళ్ల సీజన్ లో ఉపరశమనం ప్రకటించినప్పటికీ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.7,000 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైలో గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8010, ముంబైలో రూ.8010, దిల్లీలో రూ.8025, కలకత్తాలో రూ.8010, బెంగళూరులో రూ.8010, కేరళలో రూ.8010, వడోదరలో రూ.8015, జైపూరులో రూ.8025, అహ్మదాబాదులో రూ.8015, లక్నోలో రూ.8025, కోయంబత్తూరులో రూ.8010, మంగళూరులో రూ.8010, నాశిక్ లో రూ.7942, అయోధ్యలో రూ.8025, బళ్లారిలో రూ.8010, గురుగ్రాములో రూ.8025, నోయిడాలో రూ.8025 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

Gold and silver rates up even basic import duties cut by Indian Gov Know latest Rates

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిగణిస్తే 100 గ్రాములకు రూ.7,600 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైలో గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8738, ముంబైలో రూ.8738, దిల్లీలో రూ.8753, కలకత్తాలో రూ.8738, బెంగళూరులో రూ.8738, కేరళలో రూ.8738, వడోదరలో రూ.8743, జైపూరులో రూ.8753, అహ్మదాబాదులో రూ.8743, లక్నోలో రూ.8753, కోయంబత్తూరులో రూ.8738, మంగళూరులో రూ.8738, నాశిక్ లో రూ.8741, అయోధ్యలో రూ.8753, బళ్లారిలో రూ.8738, గురుగ్రాములో రూ.8753, నోయిడాలో రూ.8753గా ఉన్నాయి.

ఈవారంలో కూడా బంగారం ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. నిపుణుల అంచనాల ప్రకారం పసిడి ధర ఔన్సుకు 3000 డాలర్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా గోల్డ్ భారీగా ధర పెరుగుతూ భవిష్యత్తు ధరలపై క్లారిటీ వస్తోంది.

తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.8010గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8738 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+