A Oneindia Venture

Gold Rate: సామాన్యులకు పసిడి షాక్ వేవ్స్.. గ్రాముకు రూ.60 పెరిగిన ధర, హైదరాబాదులో..

Gold Price Today: మార్చి మాసంలో బయట ఎండలు పెరుగుతూ ప్రజలకు సెగపుట్టిస్తుంటే మరో పక్క పసిడి ధరలు ఇంట్లో కూర్చున్నవారికి సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఎంతోకొంత తగ్గుతాయని భావించిన పసిడి ధరలు నిరంతరం పెరుగుతూపోవటం తెలుగు రాష్ట్రాల్లోని పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.5500 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.8120, ముంబైలో రూ.8120, దిల్లీలో రూ.8135, కలకత్తాలో రూ.8120, బెంగళూరులో రూ.8120, కేరళలో రూ.8120, పూణేలో రూ.8120, వడోదరలో రూ.8125, అహ్మదాబాదులో రూ.8125, జైపూరులో రూ.8135, లక్నోలో రూ.8135, మంగళూరులో రూ.8120, నాశిక్ లో రూ.8123, అయోధ్యలో రూ.8135, బళ్లారిలో రూ.8120, గురుగ్రాములో రూ.8135, నోయిడాలో రూ.8135గా ఉన్నాయి.

Gold and silver rates skyrocking shocks Hyderabad buyers Know details

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.6000 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.8858, ముంబైలో రూ.8858, దిల్లీలో రూ.8873, కలకత్తాలో రూ.8858, బెంగళూరులో రూ.8858, కేరళలో రూ.8858, పూణేలో రూ.8858, వడోదరలో రూ.8863, అహ్మదాబాదులో రూ.8863, జైపూరులో రూ.8873, లక్నోలో రూ.8873, మంగళూరులో రూ.8858, నాశిక్ లో రూ.8861, అయోధ్యలో రూ.8873, బళ్లారిలో రూ.8858, గురుగ్రాములో రూ.8873, నోయిడాలో రూ.8873గా ఉన్నాయి. అయితే ఈ ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి, వ్యాపారి లాభాలు వంటివి కలపకముందువిగా గుర్తుంచుకోవాలి.

మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.8120గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8858 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.8120గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8858 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 పెరిగి రూ.1,10,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+