Gold Rates: అక్షయ తృతీయ తర్వాత రెండు రోజుల పాటు బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వచ్చాయి. అయితే నేడు పసిడి ధరలు మళ్లీ పెరగటం ప్రారంభించాయి.
ఈ రోజు బంగారం ధరలు తిరిగి పెరగటం ప్రారంభం కావటానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మెుదటగా అమెరికా డాలర్ దూకుడు తగ్గటంతో పసిడి పరుగులు మెుదలయ్యాయి. దీనికి తోడు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ మళ్లీ వడ్డీ రేట్లను ఈ సారి కూడా పెంచుతుందనే వార్తల ఆందోళనలు గోల్డ్ ధరల పెరుగుదలకు దోహదపడ్డాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రిటైల్ మార్కెట్లో రూ.200 వరకు తగ్గాయి. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే రూ.220 మేర తగ్గాయి. అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.61,420, ముంబైలో రూ.60,930, దిల్లీలో రూ.61,080, కోల్కత్తాలో రూ.60,930, బెంగళూరులో రూ.60,980, కేరళలో రూ.60,930, మధురైలో రూ.61,420, మంగళూరులో రూ.60,980 వద్ద 24 క్యారెట్ల పసిడి అమ్ముడు పోతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల పసిడి ధరలను పరిశీలిస్తే తెలంగాణలోని హైదరాబాదు, ఖమ్మం, వరంగల్, నిజాంబాద్ లలో రూ.60,930గా ఉంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, కాకినాడ, ఏలూరులలో పసిడి ధర రూ.60,930 వద్ద ఉంది. ఇక వెండి విషయానికి వస్తే.. కేజీ వెండి ధర నిన్నటితో పోల్చితే రూ.300 పెరిగి నేడు రూ.76,700 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications