Gold Price Today: వరుసగా మూడవ రోజు సైతం బంగారం ధరలు దేశీయంగా భారీ పెరుగుదలను చూశాయి. ఈ క్రమంలో గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠాల దిశగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. మరో పక్క సెంట్రల్ బ్యాంకులు సైతం తమ కొనుగోళ్లను నిరంతరాయంగా కొనసాగించటం రేట్లను ప్రేరేపిస్తోంది. ప్రస్తుత పెరుగుదలతో వారాంతంలో షాపింగ్ కోసం వెళదామని భావిస్తున్న భారతీయ పసిడి ప్రియులు నేడు పెరిగిన రేట్లతో హవాక్ అవుతున్నారు. దాదాపుగా గ్రాము రేటు 8000ల రూపాయలకు చేరువలోకి రావటం గందరగోళానికి గురిచేస్తోంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.8000 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన పసిడి రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7240, ముంబైలో రూ.7240, దిల్లీలో రూ.7255, కలకత్తాలో రూ.7240, బెంగళూరులో రూ.7240, కేరళలో రూ.7240, వడోదరలో రూ.7245, అహ్మదాబాదులో రూ.7245, జైపూరులో రూ.7255, మంగళూరులో రూ.7240, నాశిక్ లో రూ.7243, అయోధ్యలో రూ.7255, బళ్లారిలో రూ.7240, గురుగ్రాములో రూ.7255, నోయిడాలో రూ.7255 వద్ద ఉన్నాయి. పైన పేర్కొన్న రేట్లు జీఎస్టీ, తరుగు, గోల్డ్ షాపుల లాభాలు వంచి ఖర్చులకు ముందు రేట్లని గుర్తుంచుకోండి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటి కంటే 100 గ్రాములకు రూ.8700 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7898, ముంబైలో రూ.7898, దిల్లీలో రూ.7913, కలకత్తాలో రూ.7898, బెంగళూరులో రూ.7898, కేరళలో రూ.7898, వడోదరలో రూ.7903, అహ్మదాబాదులో రూ.7903, జైపూరులో రూ.7913, మంగళూరులో రూ.7898, నాశిక్ లో రూ.7901, అయోధ్యలో రూ.7913, బళ్లారిలో రూ.7898, గురుగ్రాములో రూ.7913, నోయిడాలో రూ.7913గా కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7240గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7898 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7240గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7898 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.2000 పెరిగి నేడు రూ.1,05,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు మరియు మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications