Gold Rate: యుద్ధం ప్రకటించిన గోల్డ్.. షాకింగ్ నేడు రూ.8700 పెరుగుదల, ఏపీ తెలంగాణ రేట్లివే..

Gold Price Today: వరుసగా మూడవ రోజు సైతం బంగారం ధరలు దేశీయంగా భారీ పెరుగుదలను చూశాయి. ఈ క్రమంలో గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠాల దిశగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. మరో పక్క సెంట్రల్ బ్యాంకులు సైతం తమ కొనుగోళ్లను నిరంతరాయంగా కొనసాగించటం రేట్లను ప్రేరేపిస్తోంది. ప్రస్తుత పెరుగుదలతో వారాంతంలో షాపింగ్ కోసం వెళదామని భావిస్తున్న భారతీయ పసిడి ప్రియులు నేడు పెరిగిన రేట్లతో హవాక్ అవుతున్నారు. దాదాపుగా గ్రాము రేటు 8000ల రూపాయలకు చేరువలోకి రావటం గందరగోళానికి గురిచేస్తోంది.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.8000 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన పసిడి రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7240, ముంబైలో రూ.7240, దిల్లీలో రూ.7255, కలకత్తాలో రూ.7240, బెంగళూరులో రూ.7240, కేరళలో రూ.7240, వడోదరలో రూ.7245, అహ్మదాబాదులో రూ.7245, జైపూరులో రూ.7255, మంగళూరులో రూ.7240, నాశిక్ లో రూ.7243, అయోధ్యలో రూ.7255, బళ్లారిలో రూ.7240, గురుగ్రాములో రూ.7255, నోయిడాలో రూ.7255 వద్ద ఉన్నాయి. పైన పేర్కొన్న రేట్లు జీఎస్టీ, తరుగు, గోల్డ్ షాపుల లాభాలు వంచి ఖర్చులకు ముందు రేట్లని గుర్తుంచుకోండి.

Gold and silver rates rising in rocket speed amid Diwali Nearing Buyers in fear of prices

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటి కంటే 100 గ్రాములకు రూ.8700 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7898, ముంబైలో రూ.7898, దిల్లీలో రూ.7913, కలకత్తాలో రూ.7898, బెంగళూరులో రూ.7898, కేరళలో రూ.7898, వడోదరలో రూ.7903, అహ్మదాబాదులో రూ.7903, జైపూరులో రూ.7913, మంగళూరులో రూ.7898, నాశిక్ లో రూ.7901, అయోధ్యలో రూ.7913, బళ్లారిలో రూ.7898, గురుగ్రాములో రూ.7913, నోయిడాలో రూ.7913గా కొనసాగుతున్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7240గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7898 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7240గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7898 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.2000 పెరిగి నేడు రూ.1,05,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు మరియు మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+