Gold Rate: సోమవారం శపించిన పసిడి.. రూ.5,500 పెరిగిన గోల్డ్ ధర, ఏపీ-తెలంగాణ తాజా రేట్లివే..

Gold Price Today: గడచిన వారం రోజుల సమయంలో దాదాపు రెండు సార్లు భారీగా తగ్గిన పసిడి ధరలు మళ్లీ తమ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ట్రంప్ భారతదేశపు పన్నులపై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యంత ఎక్కువ పన్నులు ఇండియా విధిస్తోందని మెుదటి టర్మ్ లో చెప్పిన ట్రంప్ ఇకపై తాము కూడా అదే విధంగా పన్నులు విధించనున్నట్లు ప్రపంచ దేశాలకు స్పష్టం చేశారు.

ప్రస్తుతం పెరుగుతున్న పసిడి ధరలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి అమెరికా తాజా ట్రేడ్ టారిఫ్స్ కారణంగా ముందస్తు వ్యూహాత్మక రక్షణ చర్యల్లో భాగంగా చైనా నుంచి పసిడి డిమాండ్ పెరగటంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. ప్రస్తుతం చైనా-యూఎస్ ట్రేడ్ వార్ కారణంగా అప్రమత్తమైన ప్రపంచ దేశాల నుంచి కూడా పసిడికి డిమాండ్ పెరుగుతోంది. ఈ కారణాలతో గోల్డ్ రేట్లు సామాన్యులకు అందనంత స్థాయిలకు పెరిగిపోయాయి.

Gold and silver rates rising drastically shocking Indian buyers this week too Know latest AP TG rates

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5,000 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7940, ముంబైలో రూ.7940, దిల్లీలో రూ.7955, కలకత్తాలో రూ.7940, బెంగళూరులో రూ.7940, కేరళలో రూ.7940, పూణేలో రూ.7940, వడోదరలో రూ.7945, జైపూరులో రూ.7904, లక్నోలో రూ.7904, మంగళూరులో రూ.7940, నాశిక్ లో రూ.7943, అయోధ్యలో రూ.7955, బళ్లారిలో రూ.7940, గురుగ్రాములో రూ.7955, నోయిడాలో రూ.7955గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.5,500 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.8662, ముంబైలో రూ.8662, దిల్లీలో రూ.8677, కలకత్తాలో రూ.8662, బెంగళూరులో రూ.8662, కేరళలో రూ.8662, పూణేలో రూ.8662, వడోదరలో రూ.8667, జైపూరులో రూ.8621, లక్నోలో రూ.8621, మంగళూరులో రూ.8662, నాశిక్ లో రూ.8665, అయోధ్యలో రూ.8677, బళ్లారిలో రూ.8662, గురుగ్రాములో రూ.8677, నోయిడాలో రూ.8677గా ఉన్నాయి.

మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7889గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8606 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7889గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8606 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,08,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+