Gold Rate: తిరిగి ఆకాశానికి గోల్డ్ రేట్లు.. నేడు రూ.8,200 పెరిగిన ధర, ఏపీ-తెలంగాణ తాజా రేట్లివే..

Gold Price Today: సామాన్యులకు తిరిగి పసిడి ధరలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఈవారం మెుదటి నుంచి గోల్డ్ ధరలు క్రమంగా పెరుగుతూ తిరిగి సామాన్యులు అందుకోలేని స్థాయిలకు చేరుకుంటున్నాయి. దీంతో చాలా మంది క్రిస్టమస్, సంక్రాంతి షాపింగ్ చేయాలా, రేట్లు తగ్గే అవకాశాల కోసం వేచి చూడాలా అనే ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో నేడు ఏపీ తెలంగాణలో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే..

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.7500 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7205, ముంబైలో రూ.7205, దిల్లీలో రూ.7220, కలకత్తాలో రూ.7205, బెంగళూరులో రూ.7205, హైదరాబాదులో రూ.7205, కేరళలో రూ.7205, వడోదరలో రూ.7210, అహ్మదాబాదులో రూ.7210, జైపూరులో రూ.7220, లక్నోలో రూ.7220, పాట్నాలో రూ.7210, మంగళూరులో రూ.7205, నాశిక్ లో రూ.7208, అయోధ్యలో రూ.7220, బళ్లారిలో రూ.7205, నోయిడాలో రూ.7220, గురుగ్రాములో రూ.7220 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

Gold and silver rates mega rally shocking indian buyers on Tuesday Know latest Rates

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.8,200 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7860, ముంబైలో రూ.7860, దిల్లీలో రూ.7875, కలకత్తాలో రూ.7860, బెంగళూరులో రూ.7860, హైదరాబాదులో రూ.7860, కేరళలో రూ.7860, వడోదరలో రూ.7865, అహ్మదాబాదులో రూ.7865, జైపూరులో రూ.7220, లక్నోలో రూ.7875, పాట్నాలో రూ.7865, మంగళూరులో రూ.7860, నాశిక్ లో రూ.7863, అయోధ్యలో రూ.7875, బళ్లారిలో రూ.7860, నోయిడాలో రూ.7875, గురుగ్రాములో రూ.7875గా ఉన్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7205గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7860 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7205గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7860 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.4500 పెరిగి రూ.1,04,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+