Gold Price Today: మే నెల మెుదటి రోజున పసిడి ప్రియులకు పెద్ద శుభవార్త. భారతీయ గోల్డ్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే అక్షయతృతీయ దగ్గరపడుతున్న వేళ భారీగా బంగారం ధర క్షీణించింది. చాలా కాలంగా గందరగోళంలో ఉన్న పసిడి ప్రియులు ప్రస్తుతం ఉపశమనం పొందుతున్నారు.
నేడు 22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.10,000 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో చాలా మంది నేడు తమ ఆభరణాల షాపింగ షురూ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను 10 గ్రాములకు పరిశీలిస్తే.. చెన్నైలో రూ.66,350, ముంబైలో రూ.65,550, దిల్లీలో రూ.65,700, కలకత్తాలో రూ.65,550, బెంగళూరులో రూ.65,550, కేరళలో రూ.65,550, వడోదరలో రూ.65,600, జైపూరులో రూ.65,700, మంగళూరులో రూ.65,550, నాశిక్లో రూ.65,580, అయోధ్యలో రూ.65,700, బళ్లారిలో రూ.65,550, గురుగ్రామ్ రూ.65,550 వద్ద ఉన్నాయి.

ఈ క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 100 గ్రాములకు నేడు నిన్నటి కంటే రూ.10,900 మేర తగ్గుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని పలు నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను 10 గ్రాములకు పరిశీలిస్తే.. చెన్నైలో రూ.72,380, ముంబైలో రూ.71,510, దిల్లీలో రూ.71,660, కలకత్తాలో రూ.71,510, బెంగళూరులో రూ.71,510, కేరళలో రూ.71,510, వడోదరలో రూ.71,560, జైపూరులో రూ.71,660, మంగళూరులో రూ.71,510, నాశిక్లో రూ.71,560, అయోధ్యలో రూ.71,660, బళ్లారిలో రూ.71,510, గురుగ్రామ్ రూ.71,510గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.65,550గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,510 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.500 తగ్గి రూ.86,500 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications