Gold Price Today: పసిడి ధరలు బ్రేకుల్లోని బుల్డోజరులా దూసుకుపోతోంది. ఈ క్రమంలో దీపావళికి షాపింగ్ చేద్దామని ప్లాన్ చేస్తున్న అనేక మంది ఆందోళన చెందుతున్నారు. దనత్రయోదశి అక్టోబర్ 29న రావటంతో చాలా మంది ఎంతోకొంత గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా షాపుల యజమానులు దీనికి తగినట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ.. భారీగా పెరిగిన రేట్లు డిమాండ్ తగ్గిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు కొత్త ఆఫర్లతో ముందుకొస్తున్నారు.
MCXలో గోల్డ్, సిల్వర్ ధరలు నేడు సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. డిసెంబర్ 5 ఎక్స్పెయిరీ ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.78,240కి చేరుకోగా, వెండి ధర కేజీకి రూ.98,224 రేటు పలుకుతోంది. ఇక అమెరికా స్పాట్ మార్కెట్లో గోల్డ్ 2725.81 డాలర్ల వద్ద తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో వెండి ధరలు 12 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. వీటికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే సమీపంలో ఉన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒకటి కాగా, మధ్యప్రాశ్చంలో కొనసాగుతున్న ఆందోళనలు రేట్లను ప్రేరేపిస్తున్నాయి.

22 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన వాస్తవ రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7300, ముంబైలో రూ.7300, దిల్లీలో రూ.7315, కలకత్తాలో రూ.7300, బెంగళూరులో రూ.7300, కేరళలో రూ.7300, వడోదరలో రూ.7305, జైపూరులో రూ.7315, లక్నోలో రూ.7315, మంగళూరులో రూ.7300, నాశిక్లో రూ.7303, అయోధ్యలో రూ.7315, బళ్లారిలో రూ.7300, గురుగ్రాములో రూ.7315, నోయిడాలో రూ.7315 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటి కంటే రూ.2200 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన గోల్డ్ వక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.7964, ముంబైలో రూ.7964, దిల్లీలో రూ.7979, కలకత్తాలో రూ.7964, బెంగళూరులో రూ.7964, కేరళలో రూ.7964, వడోదరలో రూ.7969, జైపూరులో రూ.7979, లక్నోలో రూ.7979, మంగళూరులో రూ.7964, నాశిక్లో రూ.7967, అయోధ్యలో రూ.7979, బళ్లారిలో రూ.7964, గురుగ్రాములో రూ.7979, నోయిడాలో రూ.7979గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7964 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7964 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1500 పెరిగి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications