దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. భారతదేశంలో పసిడి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతున్నా మన దేశంలో మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దేశీయంగా పసుపులోహం పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు సందిగ్ధంలో పడ్డారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే భారత్ లో మాత్రం ధరల్లో పెరుగుదల నమోదైంది.
గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3,376.69 డాలర్ల వద్దకు పడిపోగా.. US గోల్డ్ ఫ్యూచర్స్ 3,432.40 డాలర్లకి తగ్గినట్టు రాయిటర్స్ పేర్కొంది. అయితే అదే సమయంలో భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,02,330కి పెరిగింది. ఇది 10 గ్రాములకు రూ. 110 పెరుగుదలగా చెప్పుకోవచ్చు. 22 క్యారెట్ల బంగారం కూడా రూ. 100 పెరిగి రూ. 93,800కి చేరుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా బలపడుతున్న డాలర్, ఆర్థిక డేటా, ఫెడ్ రిజర్వ్ నిర్ణయాల అంచనాలు.. ఇవన్నీ గోల్డ్ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. CME ఫెడ్వాచ్ టూల్ ప్రకారం చూసుకున్నట్లయితే సెప్టెంబర్లో US ఫెడ్ రేటు కోత వచ్చే అవకాశం 88 శాతం గా ఉందని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. బలహీనమైన జాబ్ డేటా ఈ అంచనాలకు మరింతగా బలాన్ని ఇచ్చింది. అయితే ఫెడ్ నుండి స్పష్టమైన సంకేతాల కోసం Gold ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. బంగారం ఇప్పుడిప్పుడే సరైన దారిలోకి వస్తోంది. అదే సమయంలో డాలర్ బలపడడం కూడా కనిపిస్తోందని టేస్టీలైవ్ గ్లోబల్ మాక్రో హెడ్ ఇలియా స్పివాక్ రాయిటర్స్కు తెలిపారు.
భారతదేశంలో బంగారం ధరల పెరుగుదల వెనుక పలు కారకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాజకీయ, ఆర్థిక స్థిరత్వంతో పాటుగా వడ్డీ రేట్లపై RBI తటస్థ వైఖరి, వినియోగదారుల నమ్మకం, పండుగ సీజన్ డిమాండ్ ఇవన్నీ దేశంలొ బంగారం పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వైస్ ప్రెసిడెంట్ అక్ష కాంబోజ్ మాట్లాడుతూ రూ. లక్షకు పైగా ఉన్న బంగారం ధర రిస్క్-విముఖతను సూచిస్తుంది. ఇది పెట్టుబడి నిపుణుల దృష్టిలో ఒక సురక్షితమైన ఆస్తిగా మారుతోందని అన్నారు.
బంగారం పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు ఏం చెబుతున్నారంటే.. బంగారాన్ని SIP రూపంలో నెలవారీగా కొనుగోలు చేయడం ఉత్తమమని చెబుతున్నారు. అలాగే గోల్డ్ ETFs, డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలని సలహా ఇస్తున్నారు. పెద్ద మొత్తాలను ఒకేసారి పెట్టడం కన్నా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటే రిస్క్ తగ్గుతుందని చెబుతున్నారు. ఆగ్మాంట్ రిసర్చ్ హెడ్ రెనిషా మాట్లాడుతూ.. పండుగల కాలంలో కొనుగోలు మరింత బలపడుతుంది. అందుకే రిటైల్ గోల్డ్ డిమాండ్, తక్కువ ద్రవ్యోల్బణంతో మరింత పెరగవచ్చని అన్నారు.
కాగా నేడు బంగారం ధరలు పెరగడం, తగ్గడం తాత్కాలికమే.. దీర్ఘకాలికంగా చూస్తే బంగారం ధర భారీగానే పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆలోచించి క్రమంగా కొనుగోలు చేయడం ఉత్తమం. అలాగే బంగారంలో పెట్టుబడులు పెట్టడం కూడా ముందు ముందు మంచి లాభాలు ఇస్తుందని మాత్రం చెప్పవచ్చు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై నిపుణులు షాకింగ్ న్యూస్.. 10 గ్రాముల పసిడి రూ. 2 లక్షల పైమాటే..



Click it and Unblock the Notifications