మన నిత్య జీవితంలో ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్లు భాగమైపోయాయి. ఆఫీసుకెళ్లాలన్నా, అర్జంటుగా ఎక్కడికైనా వెళ్లాలన్నా వెంటనే మొబైల్ తీసి రైడ్ బుక్ చేసుకుంటాం. అయితే, మనకు సేవలు అందించే ఈ గిగ్ వర్కర్లు (Gig Workers) ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 7వ తేదీ.. శనివారం నాడు దేశవ్యాప్త నిరసనకు సిద్ధమయ్యారు. దీనిని 'ఆల్ ఇండియా బ్రేక్డౌన్' (All India Breakdown) అని పిలుస్తున్నారు.

నిరసన ఎందుకు? ప్రధాన డిమాండ్లు ఏమిటి?
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫారమ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) తో పాటు ఇండియన్ లేబర్ వెల్ఫేర్ ఫెడరేషన్ వంటి అనేక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. వీరి ప్రధాన ఆరోపణ ఏమిటంటే.. అగ్రిగేటర్ సంస్థలు (Ola, Uber, Rapido) ఛార్జీలను తమకు ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయిస్తున్నాయని, దీనివల్ల డ్రైవర్లకు గిట్టుబాటు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్' అమలులో ఉన్నప్పటికీ.. సంస్థలు వాటిని పట్టించుకోవడం లేదని యూనియన్ నేతలు అంటున్నారు. కనీస బేస్ ఫేర్ ను (Minimum Base Fare) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సొంత అవసరాల కోసం వాడే ప్రైవేట్ వాహనాలను (White Plate) కమర్షియల్ పనుల కోసం వాడటాన్ని కఠినంగా అరికట్టాలని కోరుతున్నారు.
ఆరు గంటల పాటు నిలిచిపోనున్న సేవలు
ఈ నిరసనలో భాగంగా ఫిబ్రవరి 7న సుమారు ఆరు గంటల పాటు గిగ్ వర్కర్లు తమ యాప్లను ఆఫ్ చేసి, రోడ్లపైకి రాకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విమానాశ్రయాలకు వెళ్లే వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి రావచ్చు.
గిగ్ ఎకానమీలో పెరుగుతున్న సవాళ్లు
భారతదేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య ఏటికేడూ భారీగా పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 1.2 కోట్లకు చేరింది. అంటే మన దేశ మొత్తం శ్రామిక శక్తిలో 2 శాతం మంది ఈ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. స్మార్ట్ఫోన్ల వాడకం పెరగడం, డిజిటల్ పేమెంట్స్ సులభతరం కావడంతో ఈ రంగం వేగంగా విస్తరించింది. అయితే విస్తరణ జరుగుతున్నా వారి ఆదాయాల్లో మాత్రం స్థిరత్వం లేదు. ఆర్థిక సర్వే ప్రకారం.. దాదాపు 40 శాతం మంది గిగ్ వర్కర్లు నెలకు రూ. 15,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. పెట్రోల్ ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు పెరగడంతో వారి చేతికి మిగిలేది చాలా తక్కువగా ఉంటోంది. గత డిసెంబర్ నెలలో కూడా ఫుడ్ డెలివరీ బాయ్స్ తమ వేతనాలు పెంచాలని నిరసనలు చేపట్టిన సంగతి మనకు తెలిసిందే.
ఈ 'ఆల్ ఇండియా బ్రేక్డౌన్' ద్వారా తమ గోడును ప్రభుత్వం వింటుందని గిగ్ వర్కర్లు ఆశిస్తున్నారు. మరి ఈ నిరసనపై అగ్రిగేటర్ సంస్థలు, ప్రభుత్వం ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications