వ్యాక్సీన్ వేయించుకుంటే రిలయన్స్ జనరల్ ఇన్సురెన్స్ బంపరాఫర్
కస్టమర్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడాన్ని ప్రోత్సహించేందుకు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ వేయించుకున్న కస్టమర్లకు 5 శాతం డిస్కౌంట్ను ప్రకటించింది. కొత్తగా జీవిత బీమా పాలసీలు తీసుకున్న వారితో పాటు ప్రీమియం చెల్లింపులకు కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇది ఒక్క విడత ప్రీమియంకు పరిమితమని కంపెనీ వెల్లడించింది.
రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ పాలసీపై ప్రస్తుతం ఇస్తున్న డిస్కౌంట్లకు అదనంగా ఇది ఒక్క విడతకు మాత్రమే వర్తింప చేస్తున్నట్లు తెలిపింది. తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా ఈ డిస్కౌంట్ పొందవచ్చు. కస్టమర్లకు రివార్డ్స్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఉబెర్ సేవలు
కరోనా నేపథ్యంలో ఉబెర్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఉచిత రైడ్స్ను అందిస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోవడానికి వ్యాక్సీన్ కేంద్రాలకు వెళ్లేవారికి ఉచిత క్యాబ్ సౌకర్యాన్ని అందిస్తోంది. రైడర్స్ వ్యాక్సీన్ కోసం వెళ్లి, ఇంటికి వచ్చేందుకు రూ.300 విలువైన రైడ్స్ (అప్ రూ.150, డౌన్ రూ.150 వరకు) పొందవచ్చని ఉబెర్ తెలిపింది. అర్హులైన తన కస్టమర్లకు ఈమెయిల్ సమాచారాన్ని పంపించింది.