Adani News: మరో కంపెనీపై కన్నేసిన గౌతమ్ అదానీ.. కొనుగోళ్ల విధ్వంసం, టార్గెట్ ఎవరు?

ITD Cementation News: భారతదేశంలో మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారీగా దానికోసం డబ్బును సైతం కేటాయించింది. దీంతో వస్తున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని భారతీయ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తోంది. దీనికి అనుగుణంగా గౌతమ్ అదానీ అనేక కొత్త కంపెనీలను కొనుగోలు చేసేందుకు షాపింగ్ కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ కంపెనీ అయిన రెన్యూ ఎగ్జిమ్ డీఎంసీసీ తాజాగా ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ఐటీడీ సిమెంటేషన్ ఇండియాలో కీలక వాటాలను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది. ఐటీడీ సిమెంటేషన్ ఇండియాలో 46.64 శాతం వాటాను దాని ప్రమోటర్ల నుంచి రూ.3,204 కోట్లకు ఒక్కో షేరుకు రూ.400 చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ నోటిఫికేషన్‌లో కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం వెల్లడైంది. ఇదే క్రమంలో ఐటీడీ సిమెంటేషన్ పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి అదానీ గ్రూప్ ఒక్కో షేరుకు రూ.571.68 చొప్పున కొనుగోలుతో మరో 26 శాతం వాటాను పొందాలని చూస్తోంది. దీనికోసం రూ.2553 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది.

Gautam Adani s Renew Exim DMCC Acquiring key stake in ITD Cementation Know details

ఐటీడీ సిమెంటేషన్ ప్రమోటర్ ఇటాలియన్-థాయ్ డెవలప్‌మెంట్ పబ్లిక్ కంపెనీ లిమిటెడ్ జూలై 2024లో సివిల్ ఇంజినీరింగ్ కంపెనీలో తన వాటాను విక్రయించడానికి అన్వేషిస్తున్నట్లు తెలిపింది. దీని తర్వాత అదానీ గ్రూప్ దేశంలో ఎయిర్‌పోర్ట్‌లు, హైవేలు, మెట్రో ప్రాజెక్ట్‌ల వంటి రంగాల్లో సివిల్ ఇంజనీరింగ్ సామర్థ్యాలను పెంచడానికి తాజా కొనుగోలు డీల్ చేపట్టినట్లు తెలుస్తోంది. ఇది అదానీ గ్రూప్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఐటీడీ సిమెంటేషన్ మెట్రో వ్యవస్థలు, సముద్ర నిర్మాణాలు, స్పీడ్ హైవే వ్యవస్థలు, విమానాశ్రయాలు, జల-విద్యుత్ శక్తి, సొరంగాలు, డ్యామ్స్ & నీటిపారుదల, హైవేలు, వంతెనలు & ఫ్లైఓవర్‌లు, పారిశ్రామిక నిర్మాణాలు వంటి ఇంజనీరింగ్ అండ్ నిర్మాణ ప్రాజెక్టుల్లో ప్రత్యేకత కలిగి ఉంది.

2024 ఆర్థిక సంవత్సరంలో ఐటీడీ సిమెంటేషన్ ఆదాయం రూ.7,542 కోట్లుగా ఉండగా కంపెనీ లాభం రూ.274 కోట్లు వద్ద నమోదైంది. ఏడాది కాలంలో ఐటీడీ సిమెంటేషన్‌ షేర్ల ధరలు 180 శాతానికి పైగా పెరిగాయి. అలాగే గడచిన 6 నెలల్లో షేర్ల ధరలు 44% పెరుగుదలను చూసింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.9,152.84 కోట్లుగా ఉంది. ప్రస్తుతం అదానీకి చెందిన రెన్యూ ఎగ్జిమ్ పోర్ట్‌ఫోలియోలో దిల్లీ మెట్రో, కోల్‌కతా మెట్రో పనులు ఉండటంతో తాజా డీల్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అదానీ వ్యూహాత్మకంగా కుదుర్చుకున్న డీల్ అని అర్థం చేసుకోవచ్చు.

దీనికి ముందు అదానీ గ్రూప్ గడచిన వారంలో సిమెంట్ వ్యాపారాన్ని విస్తరించేందుకు సికె బిర్లాకు చెందిన ఓరియంట్ సిమెంట్ కంపెనీలో వాటాలను దక్కించుకునేందుకు రూ.8100 కోట్లు వెచ్చించింది. ఈ డీల్ అంబుజా సిమెంట్స్ ద్వారా నిర్వహించబడుతోంది. దీని ద్వారా ప్రస్తుత ప్రమోటర్లు, పబ్లిష్ వాటాదారుల నుంచి ఓరియంట్ సిమెంట్ కంపెనీకి చెందిన 46.8 శాతం వాటాలను అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. దీనిని పూర్తిగా అంతర్గత నిధుల ద్వారా చేపడుతోంది. దేశంలో తొలి స్థానంలో నిలిచిన బిర్లాలకు చెందిన అల్ట్రాటెక్ సిమెంటును వెనక్కి నెట్టేందుకు అదానీ వేగంగా కొత్తకంపెనీల్లో వాటాలు కొంటూ మార్కెట్ షేర్ విస్తరించే పనిలో కొన్ని నెలలుగా కొనసాగుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+