సంపాదనతో పాటు దానం చేయడంలో కూడా ముందున్నాడు వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ. ఆసియాలో దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేసే వారి జాబితాను తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసింది. బిలియనీర్లు గౌతమ్ అదానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ శివ్ నాడార్, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ అశోక్ దాత్వత్వపు జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ ఆసియా హీరోస్ ఆఫ్ ఫిలాంత్రోపీ జాబితా 16వ ఎడిషన్ మంగళవారం విడుదల చేసింది.

రూ. 60,000 కోట్లు
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఈ సంవత్సరం జూన్లో 60వ వడిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. సమాజహిత కార్యక్రమాల కోసం రూ. 60,000 కోట్లు ($7.7 బిలియన్లు) ఖర్చు పెడతామని ప్రకటించారు. ఈ డబ్బు ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధికి ఉపయోగిస్తామన్నారు. 1996లో స్థాపించిన అదానీ ఫౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

$1 బిలియన్
గౌతమ్ అదానీ భారతదేశంలో అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ గా ఉన్నాడు. వస్తువులు, విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్మిషన్, రియల్ ఎస్టేట్లో అదానీ గ్రూప్ ఉంది. అదానీ తర్వాత భారత్ నుంచి హెచ్ సీఎల్ టెక్ అధినేత శివ్ నాడార్ ఉన్నారు.. ఈయన భారతదేశంలోని అగ్ర దాతలలో ఒకరిగా ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా తన సంపదలో దాదాపు $1 బిలియన్లను శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు.

శివ్ నాడార్ ఫౌండేషన్
విద్య పేదవారిన శక్తివంతం ఉద్దేశంతో 1994లో శివ్ నాడార్ ఫౌండేషన్ స్థాపించారు. ఆయన ఈ సంవత్సరం అతను రూ.11,600 కోట్లు ($142 మిలియన్లు) విరాళంగా ఇచ్చాడు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు అయిన నాడార్ ఫౌండేషన్ ద్వారా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు వంటి విద్యాసంస్థలను స్థాపించడంలో సహాయం చేశారు. ఫౌండేషన్ ట్రస్టీలలో అతని భార్య కిరణ్ నాడార్, కుమార్తె రోష్ణి నాడార్ మల్హోత్రా, అల్లుడు శిఖర్ మల్హోత్రా ఉన్నారు.

అశోక్ సూటా
శివ్ నాడార్ తర్వాత అశోక్ సూటా ఉన్నారు. టెక్ టైకూన్ అశోక్ సూటా వృద్ధాప్యం, నరాల సంబంధిత వ్యాధుల అధ్యయనం కోసం ఏప్రిల్ 2021లో తాను స్థాపించిన మెడికల్ రీసెర్చ్ ట్రస్ట్కు రూ.600 కోట్లు (USD 75 మిలియన్లు) విరాళంగా ఇవ్వనున్నారు. ఆయన రూ.200 కోట్ల వ్యయంతో SKAN- వృద్ధాప్యం, నాడీ సంబంధిత వ్యాధులకు సంబంధించిన శాస్త్రీయ పరిజ్ఞాన సెంటర్ ను ప్రారంభించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications