ముఖేష్ అంబానీ తర్వాత రెండోవ్యక్తి: అదానీ అదుర్స్, ప్రపంచ టాప్-20లోకి...
ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్ నుండి మరొకరు జత కలిశారు. ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. తాజా జాబితాలో అదానీకి టాప్ 20లో స్థానం లభించింది. అదానీ గ్రూప్లోని పలు కంపెనీల షేర్లు గత ఏడాది కాలంగా భారీగా జంప్ చేశాయి. దీంతో ఆయన సంపద కూడా పెరిగింది. దీంతో టాప్ 20లో స్థానం దక్కించుకున్నారు.
టాప్ 20లో స్థానం దక్కించుకున్న వారిలో రెండో భారతీయుడిగా నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత టాప్ 20లో చోటు దక్కించుకున్న భారత కుబేరుడు అదానీయే. అదానీ గ్రూప్కు ఓడరేవులు, విమానాశ్రయాలు, బొగ్గు గనులు, పవర్ ప్లాంట్స్ వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలు ఉన్నాయి.
ఇటీవల సాంకేతిక రంగంలోనూ అడుగుపెట్టింది అదానీ గ్రూప్. ఈ ఏడాది అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్లు 96 వృద్ధి సాధిస్తే, అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ 90 శాతం పెరిగాయి. 2020లో 16.2 బిలియన్ డాలర్లగా ఉన్న అదానీ సంపద ఇప్పుడు 59 బిలియన్ డాలర్లకు చేరింది. ఇటీవలే 2021లో ప్రపంచంలోనే తక్కువ కాలంలో ఎక్కువ శాతం సంపాదించిన వ్యక్తిగా నిలిచారు.