For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖేష్ అంబానీ తర్వాత రెండోవ్యక్తి: అదానీ అదుర్స్, ప్రపంచ టాప్-20లోకి...

|

ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్ నుండి మరొకరు జత కలిశారు. ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. తాజా జాబితాలో అదానీకి టాప్ 20లో స్థానం లభించింది. అదానీ గ్రూప్‌లోని పలు కంపెనీల షేర్లు గత ఏడాది కాలంగా భారీగా జంప్ చేశాయి. దీంతో ఆయన సంపద కూడా పెరిగింది. దీంతో టాప్ 20లో స్థానం దక్కించుకున్నారు.

టాప్ 20లో స్థానం దక్కించుకున్న వారిలో రెండో భారతీయుడిగా నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత‌ ముఖేష్ అంబానీ ఈ స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత టాప్ 20లో చోటు దక్కించుకున్న భారత కుబేరుడు అదానీయే. అదానీ గ్రూప్‌కు ఓడరేవులు, విమానాశ్రయాలు, బొగ్గు గనులు, పవర్ ప్లాంట్స్ వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలు ఉన్నాయి.

Gautam Adani is now one of world’s top 20 billionaires

ఇటీవల సాంకేతిక రంగంలోనూ అడుగుపెట్టింది అదానీ గ్రూప్. ఈ ఏడాది అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్లు 96 వృద్ధి సాధిస్తే, అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్స్ 90 శాతం పెరిగాయి. 2020లో 16.2 బిలియన్ డాలర్లగా ఉన్న అదానీ సంపద ఇప్పుడు 59 బిలియన్ డాలర్లకు చేరింది. ఇటీవలే 2021లో ప్రపంచంలోనే తక్కువ కాలంలో ఎక్కువ శాతం సంపాదించిన వ్యక్తిగా నిలిచారు.

English summary

ముఖేష్ అంబానీ తర్వాత రెండోవ్యక్తి: అదానీ అదుర్స్, ప్రపంచ టాప్-20లోకి... | Gautam Adani is now one of world’s top 20 billionaires

Adani Group head Gautam Adani is now one of world’s top 20 billionaires.
Story first published: Tuesday, April 6, 2021, 21:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X