Adani-Modi: వేగం అనే పదానికి సరైన నిర్వచనంగా గౌతమ్ అదానీ అని చెప్పుకోవచ్చు. 2022లో వ్యాపారాల విస్తరణను అత్యంత వేగంగా ఆయన ముందుకు తీసుకెళ్లారు. అలా దేశ పారిశ్రామిక రంగంలో పురోగతిని తీసుకురావటంతో పాటు ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరిగా నిలిచారు. అయితే ఈయనకు ప్రధాని మోదీకి మధ్య ఉన్న సంబంధంపై అనేక ఆరోపణలు తరచుగా వినిపిస్తుంటాయి. దీనిపై తొలిసారిగా స్పందించిన గౌతమ్ అదానీ ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

రాజకీయ ఆరోపణలు..
జాతీయ రాజకీయాల్లో సహజంగా వినిపించే ఆరోపణ మోదీ సర్కార్ అదానీ, అంబానీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దేశ అభివృద్ధి అంటే మోదీకి అదానీ అభివృద్ధి అంటూ ఘాటైన విమర్శలు వింటుంటాం. అదానీ ప్రధాని నరేంద్ర మోదీకి ఎంత సన్నిహితుడు? వీరి విజయానికి మోదీకి సంబంధం ఏమిటి? అనే అనేక ఆసక్తికర ప్రశ్నలకు అదానీ ఏమని బదులిచ్చారంటే..
ఇంటర్వ్యూ..
ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థకు అదానీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రధాని మోదీ, తాను ఒకే రాష్ట్రానికి చెందినవారు కావటంతోనే తనపై రకరకాల ఆరోపణలు చేస్తున్నారని అదానీ బదులిచ్చారు. తన వ్యాపార ప్రయాణాన్ని నాలుగు భాగాలని చెప్పుకొచ్చారు. ముందుగా తన ప్రయాణం రాజీవ్ గాంధీ హయాంలోనే ప్రారంభమైందని అన్నారు. చాలా మంది ఇది విని ఆశ్చర్యపోయినప్పటికీ వాస్తవం అదేనన్నారు. వ్యాపార సరళీకరణ విధానాన్ని రాజీవ్ గాంధీ అమలు చేశారని వెల్లడించారు. అవి తన ఉత్పత్తుల ఎగుమతిని పెంచటానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.

ప్రధాని నరసింహారావు..
రెండో దశ వ్యాపార ప్రయాణం ప్రధానమంత్రి నరసింహారావు హయాంలో ప్రారంభమైందని అదానీ వెల్లడించారు. 1991 సంస్కరణల వల్ల తన వ్యాపారం లాభదాయకంగా ముందుకెళ్లిందని చెప్పారు. ఇక మూడో విడత వ్యాపారంలో మలుపు 1995లో వచ్చిందని అన్నారు. అప్పుడు కేశుభాయ్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారని.. సముద్ర తీరాల అభివృద్ధిపై ఆయన దృష్టి సారించారని చెప్పారు. ఆ కాలంలో ముంద్రా పోర్టు ఏర్పాటుకు సహాయపడిందని స్పష్టం చేశారు.

మోదీతో సంబంధం ఏంటి..?
ఈ క్రమంలో గౌతమ్ అదానీ మోదీతో తనకు ఉన్న సంబంధాలపై కూడా స్పందించారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి పనులకు పెద్దపీట వేశారని వెల్లడించారు. ఆర్థిక, సామాజిక సంస్కరణల కోసం చాలా పథకాలను తెచ్చారని వెల్లడించారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న నేటికీ పరిస్థితి అలాగే ఉందని కొనియాడారు. తనపై చేస్తున్న ఆరోపణలు, ప్రచారాలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. తాను ఏ ఒక్క నాయకుడి వల్లా విజయం సాధించలేదని.. మూడు దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాల సహాయంతోనే విజయవంతమైన వ్యాపారవేత్తగా కొనసాగుతున్నానని అదానీ వెల్లడించారు.

ప్రధానిపై ప్రశంసలు..
నరేంద్ర మోదీలో దేశవృద్ధి కోసం దూరదృష్టి కలిగిన స్ఫూర్తిదాయకమైన నాయకత్వంతో ముందుకెళ్తున్నారని అన్నారని అదానీ అన్నారు. మోదీ కేవలం విధాన మార్పులు మాత్రమే చేయలేదని.. మాన్య భారతీయుడి జీవితంలో మార్పు తెచ్చే పథకాలను కూడా తెచ్చారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థనే కాకుండా దేశ సామాజిక స్థితిగతులను కూడా మార్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని అదానీ అన్నారు. సామాజిక, వ్యవసాయ, ఆర్థిక, అభివృద్ధి చెందని రంగాల అభివృద్ధిపై మోదీ దృష్టి సారించారని కొనియాడారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications