Vibrant Gujarat Summit 2024: బిలియనీర్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024లో నేడు ప్రసంగించారు. ఈ క్రమంలో రానున్న 5 ఏళ్ల కాలంలో పెట్టుబడులపై కీలక ప్రకటన చేశారు.
పోర్ట్స్ నుంచి పవర్ వరకు అనేక రంగాల్లో వ్యాపారం చేస్తున్న సంస్థ లక్ష ఉద్యోగాల కల్పనలో భాగంగా రూ.2 లక్షల కోట్లను గుజరాత్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు గౌతమ్ అదానీ ప్రకటించారు. మునుపటి సమ్మిట్లో 2025 నాటికి తమ సంస్థలు రూ.55,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రంలో పెడతాయని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.50,000 కోట్ల మార్కును దాటినట్లు అదానీ వెల్లడించారు. దీని ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 25,000 ఉద్యోగాలు కల్పించబడ్డాయని పేర్కొన్నారు.

ఆత్మనిర్భర్ భారత్ను బలోపేతం చేయడానికి అదానీ గ్రూప్ సోలార్ ప్యానెల్స్, గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్, విండ్ టర్బైన్లతో సహా గ్రీన్ సప్లై చెయిన్లను విస్తరిస్తున్నట్లు అదానీ పేర్కొన్నారు. అతిపెద్ద సమగ్ర, పునరుత్పాదక ఇంధన పర్యావరణ వ్యవస్థను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. గుజరాత్ కచ్ఛ్లోని ఖవ్డా జిల్లాలో ప్రపంచంలోనే 30 గిగావాట్ల సామర్థ్యం కలిగిన అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ను అదానీ గ్రూప్ నిర్మిస్తోందని పేర్కొన్నారు.
2014 నుంచి భారత జీడీపీ 185 శాతం, తలసరి ఆదాయం 165 శాతం పెరిగాయని అదానీ వెల్లడించారు. గుజరాత్ సమ్మిట్ విజయవంతమైన కార్యక్రమమని అన్నారు. గత కొంత కాలంలో కొనసాగుతున్న ప్రపంచ రాజకీయ వైరుధ్యాలు, కరోనా మహమ్మారి ఉన్న పరిస్థితుల్లోనూ విజయం సాధించటాన్ని కొనియాడారు. అలాగే G20 గ్రూప్ ఆఫ్ నేషన్స్లో గ్లోబల్ సౌత్ను చేర్చినందుకు అదానీ గ్రూప్ బాస్ కూడా ప్రధాని నరేంద్ర మోడీని అభినందించారు. జనవరి 12 వరకు కొనసాగనున్న సమ్మిట్ థీమ్ "గేట్వే టు ఫ్యూచర్"గా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications