మళ్లీ వంటగ్యాస్ ధరల పెంపు: కత్తినూరుతున్న ఆయిల్ కంపెనీలు: 1 నుంచి
న్యూఢిల్లీ: చమురు సంస్థలు మరోసారి వినియోగదారులకు షాక్ ఇవ్వడానికి సిద్ధమౌతున్నాయి. గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ ఎల్పీజీ సిలిండర్ల రేట్లను పెంచడానికి సన్నాహాలు చేస్తోన్నాయి. ఒక్కో వంటగ్యాస్ సిలిండర్పై కనీసం 50 రూపాయల వరకు అదనపు భారాన్ని మోపే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికే ఆయిల్ అండ్ గ్యాస్ సరఫరా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.
స్మార్ట్ఫోన్ ప్రియులకు శాంసంగ్ బిగ్షాక్: ఈ ఏడాదే 3 కోట్ల ఫోన్లు కట్
డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల రేట్లు ఈ మధ్యకాలంలో భారీగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు ఒక్కో డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్పై 50 రూపాయల మేర భారాన్ని అదనంగా మోపాయి. కిందటి వారం కూడా స్వల్పంగా వాటి ధరలను సవరించాయి. రూ.3.50 పైసల మేర పెంచాయి. తాజా పెరుగుదలతో దేశ రాజధానిలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 1003 రూపాయలకు చేరింది. బెంగళూరులో 1,005 రూపాయలు పలుకుతోంది. చెన్నైలో రూ.1,018.50 పైసలు, కోల్కతలో 1,029 రూపాయలకు చేరింది.
గత సంవత్సరం చమురు సంస్థలు ఎల్పీజీ కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్లపై భారీగా భారాన్ని మోపిన విషయం తెలిసిందే. 205 రూపాయల వరకు ఒక్కో సిలిండర్పై భారం మోపాయి. అప్పట్లో గృహావసర వంటగ్యాస్ రేట్లను పెంచలేదు. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్ల రేట్లను రెండుసార్లు పెంచాయి. ఫలితంగా దాదాపు అన్ని నగరాల్లోనూ కమర్షియల్ సిలిండర్లు 2,000 రూపాయలను దాటేశాయి.
డొమెస్టిక్ ఎల్పీజీ వంటగ్యాస్ కనెక్షన్లపై కేంద్ర ప్రభుత్వం 200 రూపాయల చొప్పున సబ్సిడీని ప్రకటించినప్పటికీ.. అది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే వర్తిస్తోందనే విషయం తెలిసిందే. దీపం పథకం కింద మంజూరయిన కనెక్షన్లకు మాత్రమే ఈ సబ్సిడీ లభిస్తోంది. సాధారణ గృహావసర వంటగ్యాస్ కనెక్షన్ల ధరలు మాత్రం యధాతథంగా కొనసాగుతున్నాయి. జూన్ 1న లేదా మధ్య నెలలో మరోసారి ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచడం ఖాయమంటూ వార్తలు వస్తోన్నాయి.