మళ్లీ రంగంలోకి దిగిన హైడ్రా..గచ్చిబౌలిలో అనుమతులు లేని 162 ప్లాట్లు ఉన్న లేఔట్‌ కూల్చివేత..

తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వ తన చర్యలను వేగవంతం చేసింది. తాజాగా గచ్చిబౌలిలోని ఎఫ్‌సీఐ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్‌లో అనుమతుల్లేకుండా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు సోమవారం తెల్లవారుజాము నుంచే కూల్చివేయడం ప్రారంభించారు. ఈ ప్రాంతంలో సంవత్సరాలుగా పెరుగుతున్న ఆక్రమణలపై స్థానిక నివాసితులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ.. పెద్దగా స్పందన రాలేదు. అయితే, బాధితులు హైకోర్టును ఆశ్రయించిన తర్వాత పరిస్థితి మారింది.

సంధ్యా కన్వెన్షన్‌ సమీపంలోని ఈ లేఔట్‌లో రహదారులపై, పార్కులపై, ఓపెన్ స్పేస్‌లపై నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలను అధికారులు పరిశీలించారు. 162 ప్లాట్లు ఉన్న ఈ లేఔట్‌లో సంధ్యా శ్రీధరరావు పెద్దఎత్తున ప్లాట్లు కొనుగోలు చేసి, రహదారులకే అవరోధం కలిగించేలా నిర్మాణాలు చేస్తున్నారని బాధితులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తమ ప్లాట్లకు వెళ్లే మార్గాలను మూసివేయడం, ప్రతిఘటించిన వారిపై దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం వంటి ఘటనలు కూడా కోర్టులో వివరించారు. ఒక మహిళా ప్లాట్ యజమానిపై దాడి చేసి బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలు హైకోర్టును మరింత ఆగ్రహానికి గురిచేశాయి.

Hyderabad court orders demolition Hyderabad encroachments anti-encroachment drive GHMC demolition Hyderabad real estate violations illegal buildings crackdown HYDRAA FCI HYDRAA

ఈ అంశాలన్నింటిని పరిశీలించిన హైకోర్టు గత వారం సంధ్యా శ్రీధరరావుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. లేఔట్ ఒకసారి ఆమోదం పొందితే, అందులోని రహదారులు, పార్కులు, సరిహద్దులు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చరాదని స్పష్టం చేసింది. లేఔట్ మొత్తాన్ని తమ సొత్తుగా భావించి ఇతరుల హక్కులను హరించడం సహించబోదని హెచ్చరించింది. రహదారులు ఆక్రమించబడటం పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన కోర్టు వెంటనే వాటిని పునరుద్ధరించాల్సిందిగా HYDRAA కు ఆదేశాలు జారీ చేసింది.

బాధితుల విన్నపాలు, హైకోర్టు ఆదేశాలతో హైడ్రా కూల్చివేతలు షురూ చేసింది. సోమవారం ఉదయం భారీ పోలీసు బందోబస్తుతో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రహదారుల మీద ఏర్పాటైన గోడలు, అనుమతులు లేని షెడ్లు, పెట్రోల్ బంక్ నిర్మాణానికి సంబంధించిన కొన్ని భాగాలు సహా అనేక నిర్మాణాలు నేలమట్టం అయ్యాయి. ఒకప్పుడు స్పష్టంగా కనిపించని లేఔట్ రహదారులు ఇప్పుడు మళ్లీ తెరుచుకుంటుండటం అక్కడి నివాసితులకు ఉపశమనం కలిగిస్తోంది.

తాజాగా బాధిత ప్లాట్ యజమానులు హైకోర్టులో తమ గోడును మరోసారి వివరించారు. సంధ్యా శ్రీధరరావు ఎక్కువ ప్లాట్లను కొనుగోలు చేసి, మిగిలిన వారిని బెదిరించి సొంతం చేసుకోవాలనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తమకు చెందిన భూములు కూడా అక్రమంగా ఆక్రమించబడ్డాయని, చూడడానికి కూడా అనుమతించలేదని వాపోయారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సంధ్యా శ్రీధరరావుపై విధించిన రూ.10 లక్షల జరిమానా విషయంలోనూ కోర్టుకు సమాచారం అందించారు.

అన్ని వివరాలు విన్న హైకోర్టు బాధితులకు మనోధైర్యం ఇచ్చింది. రహదారులు, పార్కులను పూర్తిగా పునరుద్ధరించే బాధ్యత హైడ్రాకే ఉందని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణ ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఆలోచిస్తే, హైడ్రా తక్షణ కూల్చివేత చర్యలు కోర్టు ఆదేశాలను అమలు చేయడమే కాకుండా, లేఔట్ అసలు రూపాన్ని తిరిగి తెచ్చే దిశగా ఒక పెద్ద అడుగుగా నిలిచాయి. గచ్చిబౌలి ప్రాంతంలో నెలకొన్న అక్రమ నిర్మాణాలకు ఈ చర్యలు ఒక మలుపుగా మారాయి. బాధితుల హక్కులను కాపాడడంలో కోర్టు, హైడ్రా కలిసి తీసుకున్న నిర్ణయాలు అక్కడి నివాసులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+